అమాయకుల జీవితాలతో మావోయిస్టుల చెలగాటం
విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న మావోయిస్టులు అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారని ఎస్పీ గాష్ ఆలం అన్నారు.
వెంకటాపురం, న్యూస్టుడే: విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న మావోయిస్టులు అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారని ఎస్పీ గాష్ ఆలం అన్నారు. వెంకటాపురం మండలంలోని ఆలుబాకలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శిబిరాన్ని ప్రారంభించి గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సంక్షేమం, ఉన్నతి లక్ష్యంగా పోలీసుశాఖ సేవలందిస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో స్నేహపూర్వక పోలీసింగ్ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను కలిసి విన్నవించాలన్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులు ప్రజల సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అమాయకులతో అసాంఘిక కార్యకలాపాలను చేయిస్తున్నారన్నారు. నక్సల్స్ మాయమాటలు నమ్మి ఎవరూ తమ ఉత్తమ భవిష్యత్తును చీకటిమయం చేసుకోవద్దని సూచించారు.
1600 మందికి పరీక్షలు
స్థానిక జడ్పీఎస్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మారుమూల అటవీ గ్రామాలైన కలిపాక, కొత్తగుంపు, తిప్పాపురం, పెంకవాగు, ముత్తారం, సీతారాంపురం, బోదాపురం, ఆలుబాక ప్రాంతాలకు చెందిన మహిళలు, వృద్ధులు శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంటి, దంత, స్త్రీ వైద్యనిపుణులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు గిరిజనులకు పరీక్షలు చేశారు. సుమారు 1600 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పలువురికి కంటి అద్దాలను అందజేశారు. ఎస్పీతో పాటు ఓఎస్డీ అశోక్కుమార్ కంటి పరీక్షలు చేయించుకున్నారు.
సహపంక్తి భోజనం
వైద్యశిబిరం ప్రాంగణంలో గిరిజనులకు భోజన సదుపాయం కల్పించారు. ఎస్పీ, ఓఎస్డీతో పాటు ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జడ్పీటీసీ సభ్యురాలు పాయం రమణ, సర్పంచి పూజారి ఆదిలక్ష్మీ గిరిజన మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండలానికి చెందిన గ్రామీణ వైద్యులు, మందుల దుకాణ సంఘం బాధ్యులు సేవలందించారు. డీఎస్పీ సుభాష్బాబు, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధనసేలక్ష్మ, వైద్యులు జవహార్ కెన్నడి, భవ్యశ్రీ, వెంకటాపురం, ఏటూరునాగారం సీఐలు కె.శివప్రసాద్, రాజు, ఎస్సైలు తిరుపతిరావు, అశోక్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434