logo

తండ్రికి అనారోగ్యం..మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య

తండ్రి అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందారు. భీమవరం పట్టణ ఎస్సై ఎస్‌.సత్యసాయి కథనం ప్రకారం.. భీమవరం పరిధి నర్సయ్య అగ్రహారానికి చెందిన ఆర్‌.ఉమామహేశ్వరరావు (52) అవిహితుడు.

Updated : 05 Oct 2022 06:36 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తండ్రి అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందారు. భీమవరం పట్టణ ఎస్సై ఎస్‌.సత్యసాయి కథనం ప్రకారం.. భీమవరం పరిధి నర్సయ్య అగ్రహారానికి చెందిన ఆర్‌.ఉమామహేశ్వరరావు (52) అవిహితుడు. ఆయన తండ్రితో కలిసి ఉంటున్నారు. ఇటీవల తండ్రి అనారోగ్యానికి గురికావడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలిసి మనోవ్యధకు గురైన ఉమామహేశ్వరరావు ఈ నెల 3న పురుగులమందు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీనిని గుర్తించిన సోదరుడు అతడిని పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని