మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు.
ఊరూరా వైకాపా నాయకుల దందా
చెలరేగిపోతున్న జగన్ బ్యాచ్
యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ
రహదారుల ఛిద్రం.. జీవితాలు చిన్నాభిన్నం
- జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలోని విజ్జువారికుంటలో మీటరు లోతు అనుమతులు తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేసి అమ్ముకున్నారు. ఉపసర్పంచి వెంకటరాముడు, కొందరు నాయకులు కలిసి కలెక్టర్తో పాటు గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. గనులశాఖ చేసిన సర్వేలో రూ.20 లక్షలకు పైగా విలువైన మట్టిని అక్రమంగా తవ్వుకున్నట్లు గుర్తించినా చర్యలు లేవు.
- జంగారెడ్డిగూడెం పరిధిలోని వెంకమ్మ చెరువుకు గండి పెట్టి నీరు తోడేసి మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. దీంతో నాగులగూడెం గ్రామస్థులు గొడవ చేశారు. జలవనరుల శాఖ ఏఈ భాస్కరరావు మే 24న లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఎర్రకాలువ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను చక్రదేవరపల్లిలో 2022లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. రెండు గంటలపైగా జేసీబీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అయినా తవ్వకాలు ఆగలేదు.
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, భీమవరం అర్బన్, జంగారెడ్డిగూడెం
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి..సహజ వనరుల వినాశనానికి ధ్వంస రచన చేస్తున్నారు. రూ.వందల కోట్లు స్వాహా చేస్తున్నారు. రహదారులను నాశనం చేస్తున్నారు. పదుల సంఖ్యలో అభాగ్యులను పొట్టన పెట్టుకున్నారు.
అయిదేళ్ల వైకాపా పాలనలో ఉమ్మడి పశ్చిమలో మట్టి తరలించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. వైకాపా ప్రజాప్రతినిధుల అండతో స్థానిక నాయకులు అడ్డగోలుగా మట్టిని మింగేశారు. చెరువులను అగాధాలుగా మార్చేశారు..కొండలను మాయం చేశారు.. పోలవరం కుడి కాలువ గట్టు ధ్వంసం చేసేశారు. ఆచంట లంకలను మట్టి మాఫియాకు స్థావరాలుగా మార్చేశారు. ఎర్రకాలువకు గర్భశోకం మిగిల్చారు. ఏలూరు, పెదవేగి, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు, మండవల్లి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, లింగపాలెం, కామవరపుకోట జంగారెడ్డిగూడెం ఇలా ప్రతి మండలంలోనూ వైకాపా నాయకులే మట్టి దందా చేస్తున్నారు. అయిదేళ్లలో దాదాపు 3 కోట్ల టన్నుల మట్టిని అక్రమంగా తరలించారు. ఈ మట్టి విలువ రూ.956 కోట్లు. ఇలా జగన్ అనుచరగణం భారీగా ఆర్జించింది.
నిరసనలన్నా లెక్కలేదు
ఎర్రకాలువలో తవ్వకాలు నిలిపివేయాలంటూ జేసీబీ ముందు బైఠాయించిన న్యూడెమోక్రసీ నాయకులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకులు కోట్ల టన్నుల మట్టిని మింగేస్తుంటే గనుల శాఖ నోరు మెదపలేదు. స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకున్నా.. కనీసం ఫిర్యాదులపై కూడా చర్యలు లేవు.
రహదారులు ఛిద్రం
మట్టి వాహనాల రాకపోకలతో ధ్వంసమైన భీమవరం-అనాకోడేరు మార్గం
జగన్ పాలనలో కొత్తగా నిర్మించింది లేదు కానీ... తెదేపా హయాంలో వేసిన రహదారులను సైతం మట్టి మాఫియా ధ్వంసం చేసేసింది. మట్టి లోడుతో లారీలు, ట్రాక్టర్లు తిరగటంతో దారులు ఛిన్నాభిన్నమయ్యాయి. భీమవరం మండలం రాయలం నుంచి అనాకోడేరు రహదారిని తెదేపా ప్రభుత్వం రూ.5 కోట్లతో అభివృద్ధి చేసింది. నిరంతరం ఈ రోడ్డుపై మట్టి రవాణా చేయటంతో పూర్తిగా ధ్వంసమైంది. ఛిద్రమైన రహదారులు పెదవేగి, పెదపాడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, కైకలూరు, ఆచంట, పోడూరు.. ఇలా ప్రతి మండలంలో కనిపిస్తాయి.
మట్టి దాహంతో ప్రాణాలు తీస్తారా?
కొమరాడలో తరలిస్తున్న నల్లమట్టి
వైకాపా నాయకుల మట్టి దాహం అమాయకులైన ప్రయాణికుల ఉసురు తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రుళ్లు భారీ వాహనాలతో మట్టి తరలించే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం భీమవరం మండలం నాగేంద్రపురం దగ్గర మట్టి లారీ తిరగబడి డ్రైవర్ చనిపోయారు. మూడేళ్ల క్రితం కాళ్లలో లంక కుంత రహదారిలో మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కడికక్కడే చనిపోయారు. నాలుగేళ్ల క్రితం భీమవరం మండలం తుందుర్రు పరిధిలో మట్టి ట్రాక్టర్ ఆటోను ఢీకొనటంతో వీరవాసరం మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. కలిదిండి మండలం వెంకటాపురంలో మూడేళ్ల క్రితం మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతంలో ట్రాక్టర్ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉమ్మడి జిల్లాలో గత అయిదేళ్లుగా మట్టి తరలించే వాహనాల వల్ల 55 ప్రమాదాలు జరిగాయి. 16 మంది మృతి చెందగా 48 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో 30 శాతం మంది మంచాన పడ్డారని తెలుస్తోంది.
గత అయిదేళ్లలో అక్రమంగా తరలించిన మట్టి: 3 కోట్ల టన్నులు
ప్రభుత్వం కోల్పోయిన రాయల్టీ: రూ.39 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
[ 05-05-2024]
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
వైకాపా అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 05-05-2024]
‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. -
‘నిషా’దం వెనుక జగన్
[ 05-05-2024]
మద్యపానం నిషేధం విషయంలో జగన్ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్.. పీఠం ఎక్కాక మాట మార్చి.. -
50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 05-05-2024]
అభివృద్ధి- సంక్షేమం అంటే ఏంటో అమలు చేసి చూపిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలపై ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. -
రేపటి నుంచి తపాలా బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి, అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. -
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
[ 05-05-2024]
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. -
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం
[ 05-05-2024]
దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. -
నేడు ఏలూరుకు లోకేశ్.. యువతతో ముఖాముఖి
[ 05-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏలూరు రానున్నారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. -
అంతా గందరగోళం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. -
18 నుంచి శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు
[ 05-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
కుప్పకూలి ఉపాధి కూలీ మృతి
[ 05-05-2024]
ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు. -
కూటమి పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి
[ 05-05-2024]
ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, -
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు స్వాహా
[ 05-05-2024]
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
కూటమితోనే ప్రగతి పథం
[ 05-05-2024]
రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ