logo

మా వారికే ఓటేయాలి మరి!

ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Updated : 26 Apr 2024 05:11 IST

భీమవరం: ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వర్మ భార్య వేంకటేశ్వరి దేవి

భీమవరం పట్టణం, ఉండి, న్యూస్‌టుడే: ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి వేంకటేశ్వరి దేవి భీమవరంలోని 26వ వార్డులో గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. టిడ్కో గృహాలు పూర్తయి లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.

ఉండిలో తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి రమాదేవి ఓటర్లను అభ్యర్థించారు. ఉండి కొండ్రొతుపేట, కుంట, రాజులపేట, గౌడపేట, ఇసుకదొడ్డి, దేవునిదొడ్డి, చిక్కాల వీరన్ననగర్‌ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి రమాదేవి ఇంటింటి ప్రచారం చేశారు. మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.

ఉండి: పార్టీ శ్రేణులతో రఘురామ సతీమణి రమాదేవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని