కరెంటు బిల్లుకూ కష్టమై
విద్యుత్తు బిల్లుల బకాయిల సెగ ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను తాకింది. దాదాపు ఏడాది నుంచి బిల్లులు చెల్లింపులు జరక్కపోవడంతో ఆ శాఖ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
చెల్లించలేకపోతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
సరఫరా నిలిపివేత
భీమవరం అర్బన్, న్యూస్టుడే: విద్యుత్తు బిల్లుల బకాయిల సెగ ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను తాకింది. దాదాపు ఏడాది నుంచి బిల్లులు చెల్లింపులు జరక్కపోవడంతో ఆ శాఖ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం సరఫరా నిలిపివేశారు. ఆ రోజు ఇన్వర్టర్ ద్వారా కార్యకలాపాలు కొనసాగించిన అక్కడి ఉద్యోగులు శుక్రవారం చేతులెత్తేయడంతో రోజంతా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులతో చెప్పించడంతో పాటు అధికారులు సొంతంగా రూ.15 వేలు చెల్లించడంతో శుక్రవారం రాత్రికి సరఫరాను పునరుద్ధరించారు. ఈ కార్యాలయానికి సంబంధించి విద్యుత్తు బిల్లుల బకాయి రూ.68 వేల వరకు ఉంది.
ఏమిటీ దుస్థితి
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాటిలో రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైంది. ఏడాది కాలంగా కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్ కేటాయించకపోవడంతో విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఆ శాఖ కార్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరు అధికారులు సొంత సొమ్ముతో బిల్లులు చెల్లించినా ఆ మొత్తం తిరిగి రాలేదని సమాచారం. దీంతో ఎవరూ బిల్లులు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. క్రమంగా విద్యుత్తు బిల్లుల బకాయిలు రూ. లక్షల్లో పేరుకుపోయి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.1.59 లక్షల వరకు బిల్లు బకాయిలు ఉంది. కనెక్షన్ తొలగిస్తామంటూ వచ్చిన విద్యుత్తు శాఖాధికారులను అక్కడి సిబ్బంది బతిమాలుకుని నెలాఖరుకు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యాలయం ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరిలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే భీమవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్తు బకాయిలు సుమారు రూ.3 లక్షల వరకు, వీరవాసరం కార్యాలయానికి రూ.1.20 లక్షల మేర విద్యుత్తు బకాయిలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
భీమవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 15 సబ్ర్ిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటన్నింటికి కలిపి రూ.31.44 లక్షల మేర విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కార్యాలయాల్లో ఏడాదికి సుమారు 90 వేల దస్త్రాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.340 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 12 కార్యాలయాలుండగా వాటి ద్వారా ఏడాదికి సుమారు రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. ఏలూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని కార్యాలయాలకు ఏడాది కిందట విద్యుత్తు బిల్లుల కోసం రూ.5వేల చొప్పున విడుదల చేశారు. కొన్నింటికి మాత్రం 2020 ఏప్రిల్ తర్వాత ఇవ్వలేదని సమాచారం.
బిల్లులు చెల్లిస్తాం..
విద్యుత్తు బిల్లుల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది. భీమవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి రూ.30.22 లక్షల బడ్జెట్ ఇచ్చారు. ఈ నిధులు త్వరలోనే విడుదలవుతాయి. అన్నిచోట్లా బిల్లులు చెల్లిస్తాం. ప్రజలకు సేవలందించే కార్యాలయాలు కాబట్టి విద్యుత్తు సరఫరా నిలిపివేయొద్దంటూ మా శాఖ ఉన్నతాధికారులు విద్యుత్తు శాఖకు లేఖ ఇచ్చారు.
సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం