logo

రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు

ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 18 Apr 2024 05:37 IST

ఉండి, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఉత్తరపాలెం రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు నరసాపురం ఎంపీ కనుమూరి రఘు రామకృష్ణంరాజు హాజరై తిరిగి వెళ్తుండగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల ఆత్మీయ మధ్య పలకరింపులు.. ఆలింగనాలతో తెదేపా, జనసేన నాయకుల్లో చిరునవ్వులు చిగురించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని