logo

కూటమితోనే ప్రగతి పథం

రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,

Published : 05 May 2024 05:35 IST

ఏలూరుపాడు: ఇంటింటి ప్రచారంలో రమాదేవి

కాళ్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి, స్థానిక నాయకులతో కలిసి శనివారం రాత్రి ఏలూరుపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. మహిళా సంఘాల సభ్యులను కలిసి మద్దతు కోరారు.

ఉండి, న్యూస్‌టుడే: రఘురామకృష్ణరాజు కుమార్తె ఇందిరాప్రియదర్శిని ఎన్నార్పీఅగ్రహారం గ్రామంలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రి రఘురామ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు పలకాలని విజ్ఞప్తిచేశారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసనపూడి రాంబాబు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌కళ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నార్పీఅగ్రహారం: ఓటర్లతో మాట్లాడుతున్న ఇందిరా ప్రియదర్శిని

పాలకోడేరు, ఉండి న్యూస్‌టుడే: శృంగవృక్షంలో తెలుగు యువత ఆధ్వర్యంలో, ఉండి ఇసుకదొడ్డి, దేవునిదొడ్డి, చిక్కాలవీరన్న నగర్‌లో తెదేపా గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటింటి ప్రచారం చేశారు.

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో పలు వార్డుల పరిధిలో, మండలంలో పెదకాపవరం, చినకాపవరం, అప్పారావుపేట, గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు, రాజులపేట, కాళింగగూడెం, చినమిల్లిపాడు, సిద్దాపురం, దుంపగడప, మందపాడు, చెరుకుమిల్లి, అయిభీమవరం, కుప్పనపూడి, అజ్జమూరు గ్రామాల పరిధిలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు బృందాలుగా ఏర్పడి ఇంటింటి ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని