జలకళ వెలవెల
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళ వెలవెలబోతోంది. మెట్ట రైతులకు వరంలా మారుతుందనుకున్న పథకం లక్ష్యం ప్రారంభంలోనే గతి తప్పింది. బోర్లు తవ్విన గుత్తేదారులకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి
రైతులకు తప్పని ఎదురు చూపులు
చింతలపూడి మండలంలో బోరు డ్రిల్లింగ్ (పాత చిత్రం)
చింతలపూడి, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళ వెలవెలబోతోంది. మెట్ట రైతులకు వరంలా మారుతుందనుకున్న పథకం లక్ష్యం ప్రారంభంలోనే గతి తప్పింది. బోర్లు తవ్విన గుత్తేదారులకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉచితంగా బోర్లు వేస్తామని ప్రకటించడంతో రైతులు ఉత్సాహం చూపారు. తవ్వకాలు జరగకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
పథకం ప్రారంభించినప్పుడు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 20 సెంట్లున్న రైతులూ దరఖాస్తు చేశారు. అనంతరం అర్హుల ఎంపికకు సంబంధించి నిబంధనలు మార్చారు. తాజా నిబంధనల మేరకు రైతుకు కనీసం 2.50 ఎకరాల భూమి ఉండాలి. లేదంటే 2.50 ఎకరాలు కలిగిన రైతులు బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్ఛు అయిదు ఎకరాల్లోపు చిన్న, సన్న కారు రైతులకు బోరుతో పాటు ఉచితంగా మోటారు, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వనున్నారు.
నియోజకవర్గానికి ఒక రిగ్గు అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నెలనెలా వెయ్యి చొప్పున బోర్లు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. జిల్లాలో ఐదు ఏజెన్సీలకు బోర్ల తవ్వకాల బాధ్యత అప్పగించారు. పెండింగ్ బిల్లుల కారణంగా ఏజెన్సీలకు బోర్లు తవ్వడం భారంగా మారింది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బోర్ల తవ్వకాలు సాగడం లేదు. బోర్లు ఎప్పుడు తవ్వుతారా అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. ‘జలకళ పథకంలో రైతుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. బోర్ల తవ్వకాలకు సంబంధించి గుత్తేదారులకు కొంత బకాయి విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం. అనంతరం పనుల ప్రక్రియ వేగిరం చేస్తాం’ అని డ్వామా ఏపీడీ జి.ప్రపుల్లా అన్నారు.
చేతులెత్తేసిన గుత్తేదారులు.. సీఎఫ్ఎంఎస్ ఐడీల కేటాయింపులో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బోర్లు తవ్వే ఏజెన్సీలకు ఇంతకుముందు రాష్ట్రస్థాయిలో చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు జిల్లాస్థాయిలో చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుత్తేదారులకు రూ.5 కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే రోజురోజుకు బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో గుత్తేదారులు బోర్ల తవ్వకాలను నిలిపివేశారు.
జిల్లాలో దరఖాస్తులు 7,052
తవ్వకానికి అనుమతిచ్చిన
బోర్లు 2,958
ఇప్పటివరకు తవ్వినవి 483
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం