వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతి
కడప రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు.
కడప నేరవార్తలు, న్యూస్టుడే : కడప రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు. కడప శివానందపురానికి చెందిన హరి (36) ఎర్రగుంట్లలోని ఆర్టీపీపీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. రోజూ రైల్లో ఎర్రగుంట్లకు వెళ్లేవారు. బుధవారం మూడో ప్లాట్ఫాంపై సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంది. రైలు వెళ్లిపోతుందని పట్టాల మీదుగా అవతలికి దాటుకునే సమయంలో రైలు వచ్చి ఢీకొంది. ప్రమాదంలో హరి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హరికి 40 రోజుల కిందట వివాహమైంది. భార్య ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తోంది. భర్త మృతదేహాన్ని చూసి భార్య విలపించారు. బీ కడప శివారులోని చౌటుపల్లె సమీపంలో దిగువ రైలు పట్టాలపై బుధవారం గుర్తు తెలియని వివాహిత రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతిచెందిన మహిళకు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు.
సింగనపల్లి అడవుల్లో ఒకరు...
మర్రిపాడు, న్యూస్టుడే: మండలంలోని సింగనపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు వైయస్సార్(కడప) జిల్లా బద్వేలు మండలం నందిపల్లికి చెందిన మన్యం బలరామిరెడ్డి(74)గా గుర్తించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా సింగనపల్లిలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మర్రిపాడు ఎస్సై విశ్వనాథ్రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడై మిస్సింగ్ కేసు నమోదైందా? అని ఆరా తీశారు. బద్వేలులో మిస్సింగ్ కేసు నమోదైందని తెలియడంతో మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు బలరామిరెడ్డిగా గుర్తించారు. మృతుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ.. నొప్పిని భరించలేక శీతల పానీయంలో గుళికలు కలుపుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
చికిత్స పొందుతూ మరొకరు...
పెద్ద తిరుపాల్ (పాత చిత్రం)
వెలిదండ్ల (లింగాల), న్యూస్టుడే : రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెలిదండ్లకు చెందిన పెద్ద తిరుపాల్ (62) కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారని ఇన్ఛార్జి ఎస్సై సునీల్కుమార్రెడ్డి తెలిపారు. తిరుపాల్ తన కుమారుడుతో కలిసి ఈ నెల 16న పులివెందుల నుంచి వెలిదండ్లకు వస్తుండగా కర్ణపాపాయపల్లె సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ తిరుపాల్ చికిత్స పొందుతూ మృతిచెందారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
ముద్దనూరు, న్యూస్టుడే: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ముద్దనూరు రైల్వే నిలయం శివారు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే ఎస్సైకె.ఎస్.వర్మ బుధవారం తెలిపిన వివరాల మేరకు.. ముద్దనూరు మండలం కాండ్రోపల్లె గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి (63)కి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు మద్యానికి బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 26-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
[ 26-04-2024]
మీ ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎస్ఐ నాగమురళి తెలిపారు. శుక్రవారం మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం చర్చి వద్ద గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..