మొదలైన నామినేషన్ల సందడి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు.
తెదేపా ఎంపీ అభ్యర్థిగా భూపేష్రెడ్డి బోణీ
కలెక్టరుకు నామపత్రం అందిస్తున్న తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. తొలిరోజు తెదేపా తరఫున కడప పార్లమెంట్ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి నామినేషన్ సమర్పించారు. తన చిన్నాన్న, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి తోడురాగా కలెక్టరుకు నామపత్రాన్ని అందించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భూపేష్రెడ్డి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా తనకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 20న అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి రెండో సెట్ నామినేషన్ వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు పార్టీ నేతలు పాల్గొన్నారు. ః అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నగరానికి చెందిన షేక్ చాన్బాషా నామినేషన్ దాఖలు చేశారు.
కలెక్టరేట్ ఎదుట ప్రత్యేక భద్రత : కడప ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు కానున్న నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ బయట ప్రధాన రహదారిలో ఒకవైపు పూర్తిగా మూసేశారు. ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను కలెక్టరేట్లోకి అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలను వెనక్కు పంపారు.
తెదేపా ఎంపీ అభ్యర్థి వివరాలివి... : కడప పార్లమెంటుకు తెదేపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేష్రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు పోలీస్స్టేషన్లో నమోదైన ఎస్టీ, ఎస్టీ కేసులో పోలీసులు ఛార్జిషీట్ వేయలేదని పేర్కొన్నారు. జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులకు సంబంధించి ఛార్జిషీట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. శిక్షపడిన కేసులు లేవని తెలిపారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రూ.2 లక్షల బ్యాంకు డిపాజిట్లను చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉండగా.. రూ.9 లక్షల బ్యాంకు రుణాలున్నట్లు వివరించారు.
రఘురామిరెడ్డికి రెండు కార్లు
మైదుకూరు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామిరెడ్డి అఫిడవిట్లో కేసులను ప్రస్తావించారు. మైదుకూరు పోలీస్స్టేషన్లో నమోదైన కేసులు, కోర్టులో విచారణ దశలో ఉన్నవాటిని ప్రస్తావించారు. రైల్వే కేసు నమోదవగా.. దాన్ని కొట్టివేసినట్లు వివరించారు. రూ.55 లక్షలు విలువైన రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కడప సమీపంలో పుల్లంపల్లె దగ్గర తన పేరిట రూ.2.04 కోట్లు, భార్య పేరిట రూ.22.95 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు.
ఆకేపాటికి రూ.3.35 కోట్ల ఆస్తులు
ఈనాడు, కడప: రాజంపేట అసెంబ్లీ స్థానానికి వైకాపా తరపున పోటీ చేస్తున్న ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఆయన సతీమణికి రూ.3.35 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆకేపాడు, మందపల్లె, శేషమాంబపురం, నూనేవారిపల్లె, రాజంపేట పట్టణం తదితర ఆస్తులను పేర్కొంటూ తన పేరిట రూ.2.60 కోట్లు, భార్య అమరజ్యోతి పేరిట రూ.75 లక్షల ఆస్తున్నట్లు వివరించారు. భూముల సర్వే నంబర్లు, నివాసాలు వివరించారు. రూ.19 లక్షలు విలువైన ఇన్నోవా కారు, బ్యాంకులో డిపాజిట్లు కలిపి రూ.24.42 లక్షలు వరకు ఉన్నట్లు వివరించారు. కేసులేమీ తన పేరిట లేవని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!
[ 01-05-2024]
అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. -
దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం
[ 01-05-2024]
ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. -
కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
[ 01-05-2024]
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. -
నారా లోకేశ్ పర్యటన 5కు వాయిదా
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. -
నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
[ 01-05-2024]
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ పర్యటన... జనానికి యాతన!
[ 01-05-2024]
కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. -
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km