తీరిన వాహనదారుల కష్టాలు
టవర్క్లాక్ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.
వంతెనపై రాకపోకలు ఆరంభం
బస్సులకు ఇప్పుడే అనుమతిలేదు
టవర్క్లాక్ వద్ద వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు
అనంతపురం విద్య, న్యూస్టుడే: టవర్క్లాక్ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. ప్రకటించిన తేదీ కంటే ముందుగానే అనుమతి లభించింది. వాహనచోదకులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మంగళవారం నుంచే వాహనాల రాకపోకలకు అడ్డు తొలగించారు. కానీ, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఇంకా అనుమతివ్వలేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర లైట్ మోటారు వాహనాలు ఫ్లైఓవర్బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారులశాఖ ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. సుమారు 16 నెలలుగా పనులు సాగుతున్నాయి. నాటి నుంచి వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. రైల్వేట్రాక్కు అటువైపు నివసిస్తున్న ప్రజలు టవర్క్లాక్ వద్దకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. కొన్ని రోడ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించలేక అడ్డంగా బారికేడ్లు నిర్మించారు. దీంతో వాహనదారులు సజావుగా వెళ్లలేని పరిస్థితి. వంతెనకు అటు, ఇటు ఉన్న దుకాణదారులు కూడా వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఆర్వోబీ ప్రారంభించడంతో అనంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ప్రయాణికులకు మరికొంత కాలం అదనపు భారం
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిచ్చినా.. ఆర్టీసీ బస్సులకు అనుమతించలేదు. నడిమివంకపై నిర్మిస్తున్న వంతెన ఒకవైపు మాత్రమే పూర్తి చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి స్లాబ్పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి క్యూరింగ్ దశలో ఉంది. జాతీయ రహదారులశాఖ అధికారులు వాహనాలకు అనుమతిచ్చారు. కానీ, ట్రాఫిక్పోలీసు అధికారులు భారీ వాహనాలకు అనుమతివ్వలేదు. బళ్లారి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇస్కాన్ ఆలయం చుట్టుముట్టి రావాల్సిన పరిస్థితి. బస్టాండుకు చేరాలంటే సుమారు 6 కి.మీ. దూరం అదనంగా ప్రయాణించాలి. అదనపు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి రూ.10 అదనంగా ఆర్టీసీ బస్సులో వసూలు చేస్తున్నారు. ఈ అదనపు భారం, సమయం మరికొంత కాలం భరించక తప్పదు. అధికారులేమంటున్నారంటే..
రాకపోకలకు అనుమతిచ్చాం
ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా ప్రయాణం సాగాలనే ఉద్దేశంతో రహదారి విస్తరణ, వంతెన నిర్మాణం చేపట్టాం. వంతెన పూర్తయింది. ఇంకా వాహనదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చాం. ప్రజల ఇక్కట్లు పరిష్కరించాం. అన్ని వాహనాలు ప్రయాణించవచ్చు.
జగదీశ్గుప్తా, డీఈ, జాతీయ రహదారులశాఖ
అప్పటి నుంచి అదనపు వసూళ్లు చేయం
వంతెనపై బస్సుల ప్రయాణానికి పోలీసుశాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ట్రాఫిక్ పోలీసులు అనుమతిచ్చిన వెంటనే వంతెనపై బస్సులు నడుపుతాం. అప్పటి నుంచి అదనంగా రూ.10 వసూలు చేయం. పాత టికెట్టు రేట్లే వర్తిస్తాయి.
నాగభూపాల్, డిపో మేనేజరు, ఆర్టీసీ
15 రోజుల తర్వాతే భారీ వాహనాలు
నడిమివంకపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. అందుకే భారీ వాహనాలను అనుమతించలేదు. బ్రిడ్జి క్యూరింగ్ పనులు పూర్తయ్యాక 15 రోజుల తరువాత బస్సులకు అనుమతిస్తాం.
వెంకటేష్నాయక్, ట్రాఫిక్ సీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
[ 21-05-2024]
భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. -
ఏసీఎల్ తుదిపోరుకు ఇండియన్ సిక్సర్స్ జట్టు
[ 21-05-2024]
అనంత క్రికెట్ లీగ్ ఫైనల్కు ఇండియన్ సిక్సర్స్ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్ జట్టు ఫ్యామిలీ క్లబ్ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
[ 21-05-2024]
రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. -
మళ్లీ బాదుడు ..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళాయె..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. -
శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట
[ 21-05-2024]
శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు -
ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది
[ 21-05-2024]
శిథిలమైన చెక్డ్యామ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. -
అనంతలో జోరు వాన
[ 21-05-2024]
జిల్లా కేంద్రం అనంత నగరంలో సోమవారం రాత్రి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. -
తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
[ 21-05-2024]
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్