జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: ఎస్పీ
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎస్పీ రిషాంత్రెడ్డి తెలిపారు.
రోడ్సేఫ్టీ మొబైల్ వాహనాలకు ట్రాఫిక్ పరికరాలు పంపిణీ చేస్తున్న ఎస్పీ రిషాంత్రెడ్డి
చిత్తూరు(నేరవార్తలు), న్యూస్టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎస్పీ రిషాంత్రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన రోడ్ సేఫ్టీ మొబైల్ వాహనాలకు ట్రాఫిక్ పరికరాలు పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా నియమాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఇందుకు జిల్లాలో ఏడు రోడ్ సేఫ్టీ మొబైల్ వాహనాలకు ట్రాఫిక్ పరికరాలు పంపిణీ చేశామని చెప్పారు. ఈ వాహనాల్లోని అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తమై అందరూ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ కోన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు, ట్రాఫిక్ బటన్ లైట్, రిఫ్లెక్ట్ టేప్, క్రైం సీన్ టేప్, టార్చ్ లైట్, ప్రథమ చికిత్స కిట్, 24ఎంఎం నైలాన్ రోప్, రెయిన్ కోట్స్, ఫైబర్ లాఠీ, 20 లీటర్ల నీటి క్యాన్లు వీటిలో ఉన్నాయని చెప్పారు. అంబులెన్సు సేవలు వినియోగించడం లేక పోలీసు వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సేవలను అందించాలన్నారు. ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరెడ్డి, బాబుప్రసాద్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంగమ్మ చెంతనేతల వేషాలు ముగిసినట్లేనా?
[ 21-05-2024]
తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ శాతమూ బాగా పెరిగింది. -
విలీన పాపం.. విద్యార్థులకు శాపం
[ 21-05-2024]
పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు. -
‘అధికార’ ఒప్పందం.. అడ్డగోలు నియామకం
[ 21-05-2024]
రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. -
జననీ.. పావనీ.. పాహిమాం
[ 21-05-2024]
జగజ్జననీ.. లోకనాయకి.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతర వేడుకలకు చిత్తూరు నగరం సర్వసన్నద్ధమైంది. -
వైభవంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం
[ 21-05-2024]
కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
[ 21-05-2024]
మండల పరిధి ఓ.జి.కుప్పం వద్ద కుశస్థలి నదిలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, దండోరా వేయించాలని జేసీ పి.శ్రీనివాసులు ఆదేశించారు. -
చక్కెర, గోధుమపిండి అరకొరగా..
[ 21-05-2024]
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. -
తల తీసేస్తా..!
[ 21-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును తల తీసేస్తానంటూ ఒప్పంద ఉద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్