ఓ మిస్డ్ కాల్తో పరిచయం.. ప్రేమించాక వ్యక్తి అంధుడని తెలిసి..
ప్రేమకు ఎందరు ఎన్నో నిర్వచనాలు చెప్పారు. దీనికి మనసుతో తప్ప రూపంతో సంబంధం లేదని కొందరు చెబితే... ప్రేమ గుడ్డిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. వీటికి కొంత దగ్గరగా జరిగిందే బొలంగీర్ జిల్లాలోని ఒక ఘటన. ఒక మిస్డ్ కాల్... ఒక అంధుడ్ని, ఒక
కోర్టు వద్ద దండలు మార్చుకుంటున్న వధూవరులు
కటక్, న్యూస్టుడే ప్రేమకు ఎందరు ఎన్నో నిర్వచనాలు చెప్పారు. దీనికి మనసుతో తప్ప రూపంతో సంబంధం లేదని కొందరు చెబితే... ప్రేమ గుడ్డిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. వీటికి కొంత దగ్గరగా జరిగిందే బొలంగీర్ జిల్లాలోని ఒక ఘటన. ఒక మిస్డ్ కాల్... ఒక అంధుడ్ని, ఒక యువతిని ప్రేమికులుగా మార్చింది. తర్వాత వారు జీవిత భాగస్వాములయ్యారు. వివరాల్లోకి వెళితే... బొలంగీర్ జిల్లాలోని పాట్నాగడ్ సమితి మండమాహోళి గ్రామానికి చెందిన యువకుడు దిలీప్ తండి పుట్టుకతో అంధుడు. కొన్నాళ్ల కిత్రం ఆయన తన స్నేహితునికి ఫోన్ చేయడానికి బదులు మరో నెంబర్కి ఫోన్ చేశాడు. ఎవరూ ప్రతిస్పందించలేదు. కొంతసేపటి తర్వాత చాందిని అనే యువతి తిరిగి ఫోన్ చేసి ఆయనను ఎవరని? ఎందుకు మిస్డ్కాల్ ఇచ్చారని అడిగింది. పొరపాటున ఫోన్ చేశానని ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫోన్లో సంభాషణలు పెరిగాయి. చివరికి అది ప్రేమగా మారింది. ఒకరోజు ఆమె ఆయనను చూసేందుకు పిలిచింది. దీంతో దిలీప్ తన స్నేహితులతో కలిసి చాందిని వద్దకు వెళ్లాడు. ఆయనకు చూపులేదనే విషయం ఆమెకు అప్పుడు తెలిసింది. అయినా వారి ప్రేమలో మార్పు రాలేదు. తర్వాత ఆయనను పెళ్లి చేసుకునేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసింది. ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో వారు కూడా అంగీకరించారు. మంగళవారం పాట్నాగఢ్ న్యాయస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత బయట ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా చాందిని మీడియాతో మాట్లాడుతూ దిలీప్కు కళ్లు లేకపోయినా తన కళ్లతో ఆయనకు ప్రపంచం చూపిస్తానని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?