Eluru: ఏలూరులో సుపారీ గ్యాంగ్ హల్చల్.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులు
ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లను చూపి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది.
ఏలూరు నేర వార్తలు, న్యూస్టుడే: ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లను చూపి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది. ఎట్టకేలకు బాధితుడు మంగళవారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన అన్నే కాంతారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. పరిచయస్థుడైన సీహెచ్ వినయ్ రెడ్డి చెప్పగా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన దాట్ల బాలవెంకటసత్యనారాయణ అలియాస్ సతీష్రాజుకు కాంతారావు 2017 నుంచి 2019 వరకు విడతల వారీగా రూ.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏళ్లు అవుతున్నా సతీష్రాజు అప్పు చెల్లించలేదు. గత నెల 19న బెంగళూరు సీబీఐ కోర్టుకు వినయ్రెడ్డి, సతీష్రాజు వస్తున్నారని తెలుసుకుని కాంతారావు అక్కడికెళ్లి వారిని నిలదీశారు. త్వరలో చెల్లిస్తామని గడువు ఇవ్వాలని కోరారు.
బాకీ తీర్చమంటే..చంపేస్తాం.. డబ్బులిస్తామని చెప్పి కాంతారావును వినయ్రెడ్డి, సతీష్రాజులు గత నెల 27న ఏలూరులోని ఓ హోటల్కు రప్పించి గదిలో ఉంచారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. తాము ఎస్ఎఫ్టీ తెలంగాణ పోలీసులమని.. అరెస్టు చేస్తామని బెదిరించారు. రెండు, మూడు రోజులు అక్కడే ఉంచి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత ఓ కారులో బలవంతంగా ఎక్కించి తాడేపల్లిగూడెం వైపుగా నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. గ్యాంగులోని నలుగురిలో ముగ్గురి వద్ద పిస్టళ్లు ఉన్నాయి. ఒకరు కాంతారావు నుదుటిపై పిస్టల్ పెట్టారు. మరో ఇద్దరు గాల్లోకి, నేలపై కాల్పులు జరిపారు. నువ్వు రూ.50 లక్షలు వదిలేసుకోవాలని, బాకీ మర్చిపోతే బతికిపోతావని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. భయభ్రాంతులకు గురైన కాంతారావు అలాగే చేస్తానని అంగీకరించడంతో అతన్ని మళ్లీ హోటల్కు తీసుకొచ్చి వినయ్రెడ్డి, సతీష్రాజులకు అప్పగించారు. మ్యాటర్ సెటిల్ అయ్యిందని.. కాంతారావు అప్పు అడగడని.. మీరు నిర్భయంగా ఉండవచ్చని చెప్పి ఆ గ్యాంగ్ సభ్యులు వెళ్లిపోయారు.
కీలక సూత్రధారి ఎవరు?
మ్యాటర్ సెటిల్ చేస్తానని తాడేపల్లిగూడెం నుంచి నిందితులను నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. హోటల్ గదిలో సుపారీ గ్యాంగ్ సభ్యులు కాంతారావును కొడుతున్న సమయంలో వీడియో తీసి ఓ వ్యక్తికి చూపించే వారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ సీఐ చంద్రశేఖరరావు గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే ప్రధాన నిందితులైన సతీష్రాజు, వినయ్రెడ్డిల కోసం కూడా గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!