Shilpa Chowdary: ఆస్పత్రి ఎక్కడ? రూ.కోట్ల జాడెక్కడ?
అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు
ఫోన్కాల్ జాబితా ఆధారంగా పోలీసుల కూపీ
పలువురికి నోటీసులు జారీ
ఈనాడు, హైదరాబాద్: అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు ఈ కేసులో జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. శిల్పాచౌదరి తన వద్ద రూ.1.50 కోట్లు అప్పు తీసుకుని తిరిగి అడిగితే బెదిరిస్తున్నట్టు నవంబరు 13న దివ్యారెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే నెల 26న శిల్పాచౌదరి దంపతులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణకు సమయం ఎక్కువ తీసుకున్నారనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం కరవైంది. ఆమెను రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నా పూర్తి ఆధారాలు సేకరించలేకపోయారు. నిందితురాలి రెండు చరవాణుల్లో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. బాధితుల జాబితాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కుటుంబాలకు చెందిన వారున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవటంతో సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఆసుపత్రి ఎక్కడ.. కోట్ల జాడెక్కడ...
శిల్ప పక్కా పథకం ప్రకారమే మోసాలకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ నటుడు మహేష్బాబు సోదరి ప్రియదర్శిని వద్ద తీసుకున్న రూ.2.90 కోట్లకు చెల్లని చెక్కులు, నకిలీ బంగారు ఆభరణాలను ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. చెక్లను మార్చుకునేందుకు ప్రయత్నించినపుడు సంబంధిత బ్యాంకు ఖాతా ఎప్పుడో రద్దయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. అప్పటికి కానీ తాను మోసపోయినట్టు గ్రహించలేకపోయానంటూ ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. శిల్పాచౌదరి బ్యాంకు ఖాతాల్లో రూ.వేలల్లో మాత్రమే నగదు నిల్వలున్నాయి. బాధితులు ఒక్కొకరు రూ.కోట్లలో ఇచ్చినట్టు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారేటపుడు ఆదాయపన్ను శాఖ గుర్తించే వీలుంది. ఈ కేసులో మాత్రం బ్యాంకు ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లభించలేదని సమాచారం. నిందితురాలు చెప్పినట్టు ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ చేపట్టారు. ఎక్కడ భూములు కొనుగోలు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. విచారణకు హాజరయ్యేవారి ద్వారా సేకరించే ఆధారాలు ఈ కేసులో ముందుకెళ్లేందుకు కీలకం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్