TELANGANA : నిరుద్యోగులారా.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : కాంగ్రెస్
ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయాన్ని
హైదరాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ను ముట్టడించిన కార్యకర్తలు పైకి ఎక్కి కాంగ్రెస్ జెండాను ప్రదర్శించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిరుద్యోగ యువత, రైతులకు అండగా గన్పార్క్ స్థూపం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కోదండరెడ్డి తదితరులు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం విలేకర్లతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ‘తెరాస ప్రభుత్వం వచ్చాక గత ఆరు సంవత్సరాల్లో పంట నష్టం చెల్లించారా?కౌలు రైతుల గురించి ఆలోచించారా? వరికి రూ. 550 మద్దతు ధరను రూ. 1500 చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. మా ఆందోళన అధికారం కోసం కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానిపై చర్చకు రమ్మంటున్నాం’ అని పొన్నాల చెప్పారు.
కరోనా సమయంలో వ్యవసాయ రంగం మాత్రమే పని చేసిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. మోదీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని, అయినా ఇంతవరకు అప్పులు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు. నిరుద్యోగులు, రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మౌన దీక్ష చేపట్టామని వివరించారు.
తెలంగాణ వస్తే భవిష్యత్ బాగుంటుందని భావించామని.. నిరుద్యోగ యువత, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షకు కూర్చుంటే సీఎం దగ్గర చలనం ఉంటుందనుకున్నామన్నారు. ఇక నుంచి ఎవరూ ప్రాణాలను తీసుకోవద్దని రైతులు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద రైతు ఉద్యమం మన దేశంలోనే జరిగిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. రైతులకు భరోసాగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్