రాజసం కష్టమే
రాజస్థాన్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకుని అసాధారణ విజయం సాధించిన భాజపాకు ఈసారి హ్యాట్రిక్ కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముందని తెలుస్తోంది.
రాజస్థాన్లో భాజపా హ్యాట్రిక్ అసాధ్యమేనా..
(జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ)
రాజస్థాన్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకుని అసాధారణ విజయం సాధించిన భాజపాకు ఈసారి హ్యాట్రిక్ కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 19న జరిగిన పోలింగ్పై ఆ పార్టీ కొంత ఆశాభావంతో ఉంది. కనీసం 6 చోట్ల తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంటోంది.
అత్యల్ప పోలింగ్ ఎవరికి లాభం?
19వ తేదీన 12 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 58 శాతం పోలింగే నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 10శాతం తక్కువ. దీంతో 26వ తేదీన ఎన్నికలు జరిగే 13 నియోజకవర్గాల్లో భారీ పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని భాజపా నాయకత్వం నేతలకు సూచించింది.
కాంగ్రెస్ ఏమంటోంది..
‘రాష్ట్రంలో మోదీ ప్రభంజనం లేదని భాజపా అర్థం చేసుకుంది. అత్యల్ప పోలింగ్ నమోదే ఇందుకు నిదర్శనం. మరోవైపు కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది. వారంతా వచ్చి ఓటేశారు. తొలి విడత పోలింగ్ జరిగిన 12 నియోజకవర్గాల్లోని సగం చోట్ల కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించబోతోంది. దీంతో మరింత ఉత్సాహంతో రెండో విడతకు సిద్ధమవుతున్నాం. భాజపాను ఆశ్చర్యానికి గురిచేసే ఫలితాలు ఇక్కడ వస్తాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు భాజపా నేతలంతా హ్యాట్రిక్ విజయాల్ని అందించాలని రాజస్థాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రజలు హ్యాట్రిక్ను ఎండమావిగా మార్చేందుకు సిద్ధమయ్యారు. అందుకే తన ప్రచార సభల్లో మోదీ.. ‘ఈసారి 400కుపైగా సీట్లు’ అనే నినాదాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్పై వివాదాస్పద విమర్శలకు దిగుతున్నారు. మైనారిటీలపై వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు.
భాజపా ఏమంటోంది..
‘అత్యల్ప పోలింగ్ భాజపా అవకాశాలను దెబ్బ తీస్తుందనేది అపోహే. పోలింగ్ తక్కువ జరిగిందని అంగీకరిస్తున్నాం. వివాహాలు, ఎండలవల్ల ఓటర్లు పోలింగ్ బూత్లకు రాలేదు. మోదీపై నమ్మకమున్న భాజపా ఓటర్లు భారీగా ఓటేశారు. పోలింగ్ విషయంలో మాకేం భయం లేదు. అసంతృప్తి లేదు’ అని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ స్పష్టం చేశారు.
సచిన్ పైలట్ ఉద్ధృత ప్రచారం
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ రాష్ట్రంలో ఉద్ధృత ప్రచారం చేస్తున్నారు. ఆయన గుజ్జర్లు, మీనాల మద్దతు కూడగడుతున్నారు. ఇది టోంక్-సవాయ్ మాధోపుర్, దౌసా, భీల్వాఢా, రాజ్సమంద్, ఆజ్మేర్లలో కాంగ్రెస్కు మేలు చేసే అవకాశముంది.
రెండో విడతలో..
- రెండో విడతలో భాగంగా 26వ తేదీన టోంక్- సవాయ్ మాధోపుర్, అజ్మేర్, పాలి, జోధ్పుర్, బాడ్మేర్, ఝాలోర్, ఉదయ్పుర్, బాంస్వాడా-దుంగార్పుర్, చిత్తోడ్గఢ్, రాజ్సమంద్, భీల్వాడా, కోటాలలో పోలింగ్ జరగనుంది.
- మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, వసుంధర రాజె ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వారు తమ కుమారుల నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
- ఝాలోర్-సిరోహీలో మోదీ, గహ్లోత్ మధ్య పోరు సాగుతున్నంతగా పోటీ నెలకొంది.
- తొలి విడతలో గహ్లోత్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా వసుంధర మాత్రం తన కుమారుడి నియోజకవర్గమైన ఝాలావర్-బారాకే పరిమితమయ్యారు. పార్టీ నిర్లక్ష్యం చేయడంతో ఆమె అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
- కోటాలో ప్రహ్లాద్ గుంజాల్ నుంచి స్పీకర్ ఓం బిర్లా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
- కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శెఖావత్ జోధ్పుర్లో, కైలాశ్ చౌధరి బాడ్మేర్లో తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కులం చూసి.. టికెట్ కేటాయింపు!
అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు. -
కీలక నేతలకు అగ్ని పరీక్ష
కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు. -
చిన్న నియోజకవర్గాల్లో పెద్ద పోరు
దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
కంచుకోటలో కొత్త గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టీ ఆ నియోజకవర్గంపైకి మళ్లింది. -
మెతుకు సీమలో మెరిసేదెవరో..?
మంజీర నీటితో రాజధాని గొంతులో అమృతాన్ని నింపిన సింగూరు డ్యాం.. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు.. ప్రఖ్యాత చర్చి.. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తూ.. ‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. -
ప్రచారం వాడీ…వేడిగా
‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది. -
ఈవీఎంలో చివరిదే గానీ.. చిన్నది కాదు: ప్రజల మాటే ఈ ‘నోటా’
ఎన్నికల్లో అభ్యర్థులందరూ అందరే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏకైక ఆయుధం నోటా. 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజలు దీనిని వాడారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం. -
కమలం కోటతో కాంగ్రెస్ ఢీ
ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో లింగాయత్లు భాజపాకు వెన్నుదన్నుగా ఉంటారు. -
పచ్చని ఎన్నికలు తోడుంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికలు యమజోరుగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. -
పాత తీర్పా? మార్పా?
విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్సభ నియోజకవర్గం ఆదిలాబాద్. -
కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు