1978లో అత్యధికం..2009లో అత్యల్పం
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది.
బోధన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఆధిక్యాలు
న్యూస్టుడే - బోధన్ పట్టణం: ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది. అందుకే నియోజకవర్గంలోని ఓటర్లందరూ తననే ఆదరించాలని పోటీ చేసే అభ్యర్థులు ఆశిస్తారు. కానీ పోలైన అన్ని ఓట్లలో.. ఒకరికి కొంత ఎక్కువ పోలవుతాయి. ఆ ఓట్ల ఆధిక్యమే అతనిని విజేతగా నిలుపుతుంది. అలా బోధన్ నియోజకవర్గానికి జరిగిన పదిహేను శాసనసభ ఎన్నికల్లో రెండు ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. అందులో ఒకటి 1978లో అత్యధికంగా సాధించిన మెజారిటీ కాగా 2009లో అత్యల్ప ఆధిక్యం నమోదైంది.
వివరాలు ఇలా :
1978లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ముగ్గురికి ధరావతు గల్లంతైంది. మిగిలిన ముగ్గురిలో మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి గులాం సందాని 34,526 ఓట్లు సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డికి 11,440 ఓట్లు లభించాయి. గెలిచిన అభ్యర్థి ఓడిన వ్యక్తిపై 23,086 ఓట్లు ఎక్కువగా పొందారు. ఆధిక్యం శాతంలో చూస్తే 36.25 శాతంగా నమోదైంది. అంత ఆధిక్యం ఎప్పుడూ నమోదు కాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్లో చీలిక వచ్చి గులాం సందాని కాంగ్రెస్(ఐ) తరఫున పోటీ చేసినట్లు చెబుతారు. ఆయన కోసం ప్రచారానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బోధన్కు వచ్చారు. అత్యల్ప మెజార్టీతో బయటపడిన ఎన్నికగా 2009 నిలిచింది. ఈ ఎన్నికల్లో మొత్తం ఏడుగురు బరిలో నిలిచారు. అందులో నలుగురు తమ ధరావతు కోల్పోయారు. వారిలో విజేతగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డికి 42,494 ఓట్లు పోలయ్యాయి. ద్వితీయ స్థానంలో నిలిచిన తెరాస అభ్యర్థి షకీల్ 41,219 ఓట్లు సాధించారు. ఆధిక్యం 1,275 ఓట్లు కాగా శాతంలో చూస్తే 0.97 శాతంగా నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM