మెదక్ నియోజకవర్గంలో అమ్మ.. నాన్న.. ఓ కుమారుడు!!
ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే మెదక్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే మెదక్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇక్కడ ప్రస్తుతం భారాస నుంచి పద్మా దేవేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్రావు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం 2004లో రామాయంపేటగా ఉండేది. 2004 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి మైనంపల్లి వాణి (రోహిత్రావు తల్లి) పోటీ చేయగా... తెరాస, కాంగ్రెస్ల సంయుక్త అభ్యర్థిగా పద్మాదేవేందర్రెడ్డి నిలిచి విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పద్మా దేవేందర్రెడ్డిపై తెదేపా అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు(రోహిత్రావు తండ్రి) గెలిచారు. 2009 పునర్విభజనలో రామాయంపేటను మెదక్ నియోజకవర్గంలో కలిపేశారు. అప్పటి ఎన్నికల్లో తెదేపా-తెరాసల ఉమ్మడి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ దక్కింది. దీంతో పద్మా దేవేందర్రెడ్డి స్వతంత్రంగా పోటీ చేయగా హన్మంతరావు విజయం సాధించారు. 2014లో తెరాసలో చేరిన హన్మంతరావు... మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఇక ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్రావు టికెట్ దక్కించుకున్నారు. ఆయన తల్లి వాణి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా, తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇలా... ఒకే వ్యక్తిపై వేర్వేరు ఎన్నికల్లో అమ్మ.. నాన్న.. కుమారుడు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.
న్యూస్టుడే, రామాయంపేట, మెదక్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!