వీడియో కాన్ఫరెన్స్: ఈ జాగ్రత్తలు పాటించండి
కరోనా వైరస్ వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఐటీ, కార్పొరేట్ సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేసినా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే విధులు నిర్వహించే అవకాశముంది. వర్క్ ఫ్రమ్ హోం
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఐటీ, కార్పొరేట్ సంస్థలు ఇళ్ల నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేసినా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే విధులు నిర్వహించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం అంటే ఏముందిలే.. ఇంట్లోనే హాయిగా కూర్చొని పని చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ.. వీడియో సమావేశాలు జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.. ఉద్యోగులపై కొంత ప్రతికూల అభిప్రాయాలు వచ్చే అవకాశముంది. అందుకే తరచూ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేవారి కోసం కొన్ని సూచనలు.
చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోండి
ఆఫీస్లో డెస్క్ లేదా కాన్ఫరెన్స్ హాల్ శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. అదే ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా మనమే చూసుకోవాలి. వీడియో కాల్ సమయంలో పక్కన దిండ్లు, బట్టలు, పిల్లల ఆట వస్తువులు లాంటి కనిపిస్తే.. అవతలి వ్యక్తికి, మీకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీడియోకాల్ గురించి కుటుంబ సభ్యులకు ముందే చెప్పి అంతరాయం కలిగించకుండా జాగ్రత్త పడండి. లేదంటే కాల్ మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టడం ఇటీవల ఓ వైరల్ వీడియోలో చూసే ఉంటారు.
కెమెరాను సరైన దిశలో పెట్టండి
మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్లు మన ముఖాన్ని, కళ్లని గమనిస్తారు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ సమయంలో మీ ముఖం బాగా కనిపించే విధంగా ల్యాప్టాప్ క్యామ్, లేదా వెబ్క్యామ్ దిశను సరిచేసుకోండి. వీలైనంతగా కెమెరా వైపే చూడటానికి ప్రయత్నించండి.
హెడ్ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి
వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హెడ్ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే కాల్లో తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు, క్లయింట్స్ పాల్గొంటుంటారు. దాని వల్ల ఇంట్లో వాళ్లకు మీరు ఏదో మీటింగ్లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే మీరు వాడే హెడ్ఫోన్లో నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండేలా చూసుకోండి. దాని వల్ల మీ పిల్లల అల్లరి, ఇంటి బయట శబ్దాలు, శునకాల అరుపులు కాల్లో ఇతరులకు వినపడవు. భారీ శబ్దాలైతే కాస్త చిన్నగా వినిపిస్తాయి కాబట్టి పెద్ద సమస్య ఉండదు.
ఆ సమయంలో నోటిఫికేషన్స్ ఇబ్బందే
మనకు నచ్చిన అంశాలపై నోటిఫికేషన్స్ రూపంలో అప్డేట్స్ పొందుతుంటాం. కానీ, వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అవే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. సీరియస్గా సమావేశంలో పాల్గొంటున్నప్పుడు నోటిఫికేషన్స్ మీ ఏకాగ్రతకు భంగం కలిగించడమే కాకుండా.. వీడియో గ్రూప్ కాల్ ఉన్నవారికి విసుగు తెప్పించొచ్చు. కాబట్టి పనిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ను ఆఫ్ చేయండి. డోంట్ డిస్ట్రబ్ ఆప్షన్ను యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మంచిది.
కాస్త విరామం తీసుకోండి
విధుల్లో భాగంగా చాలా వీడియో కాన్ఫరెన్స్ల్లో మాట్లాడాల్సి వచ్చిన్పపుడు.. కాల్స్ మధ్యలో కొన్ని నిమిషాలు విరామం తీసుకోండి. ఈ సమయాన్ని కాస్త రిలాక్స్ అవడంతోపాటు ఇప్పటివరకు జరిగిన సమావేశంలో ముఖ్యమైన అంశాలను నోట్బుక్లో రాసుకోవడానికి కేటాయించండి. దీని వల్ల మీటింగ్స్ సారాంశాన్ని మరచిపోవడం లాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వీడియోకాల్కు సన్నద్ధమవడానికి కూడా ఈ విరామం ఉపయోగపడుతుంది.
తొందరొద్దు.. నిదానంగా మాట్లాడండి
పని పూర్తి చేయాలన్న తొందరలో వీడియో కాన్ఫరెన్స్లో వేగంగా మాట్లాడకండి. గ్రూప్ కాల్లో ఉన్న వారికి మీరు చెప్పింది అర్థంకాకపోవచ్చు. నిదానంగా మాట్లాడండి.. ఒక క్షణం విరామం తీసుకోవాలనుకుంటే చిన్న నవ్వు నవ్వండి.. దీని వల్ల మీరు గాబరా పడుతున్నా, ప్రసంగానికి సిద్ధంగా లేకున్నా.. ఎదుటివాళ్లకు అలా కనిపించదు.
ఆడియో మ్యూట్ చేయండి.. వీడియో హైడ్ చేయండి
సుదీర్ఘంగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్లో మీరు మాట్లాడే అవకాశం లేనప్పుడు.. లేదా మీరు మాట్లాడటం అయిపోగానే మీ ఆడియోను మ్యూట్ చేయండి. తద్వారా అనవసర శబ్దాలు ఇతరులకు వినపడకుండా ఉంటుంది. అలాగే గ్రూప్ కాల్లో మీ భాగస్వామ్యం పూర్తయినా.. లేదా మీరు గ్రూప్లో ఉండి.. మీ అవసరం లేకపోయినా కాస్త విరామం తీసుకోండి. ఆ సమయంలో వీడియోను హైడ్ చేయండి.
వీడియో కాల్ రికార్డు చేయండి
వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాల్సి రావొచ్చు. హడావిడిగా పేపర్పై రాసుకోవడం బదులు వీడియో కాల్ రికార్డు సదుపాయం ఉంటే రికార్డు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల సమావేశంలోని ముఖ్య అంశాలను కాల్ ముగిసిన తర్వాత కాస్త నింపాదిగా నోట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అలాగే సమావేశం సారాంశాన్ని మరోసారి విశ్లేషించుకోవచ్చు.
అంతరాయం కలిగించకుండా చాట్ ఫంక్షన్ వాడండి
వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఒకేసారి అందరూ ప్రశ్నలు లేవనెత్తడమో.. సమాధానం చెప్పడమో జరుగుతుంది. దీంతో గందరగోళం ఏర్పడొచ్చు. దీనికి బదులు చాట్ ఫంక్షన్ను ఉపయోగించండి. తద్వారా వీడియోకాల్ సభ్యుల ప్రశ్నలు.. సమాధానాలు స్పష్టంగా వినిపిస్తాయి.
లాగ్ఆఫ్ మర్చిపోకండి
వీడియోకాన్ఫరెన్స్ పూర్తయ్యాక లాగ్ఆఫ్ అవడం మర్చిపోకండి. లాగ్ఆఫ్ కాకుండా వెళ్లిపోతే.. మీరు కాల్ తర్వాత చేసే పనులు, జరిపే సంభాషణలు ఇతరులకు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. కాబట్టి ఒకటి రెండు సార్లు లాగ్ఆఫ్ పూర్తిగా అయ్యారో లేదో సరిచూసుకోండి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక