Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur)కు కేంద్రం భారత రత్న (Bharat Ratna) అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి తరానికి ఆయన ఎవరో అంతగా తెలియకపోయినా.. 1970, 80ల్లో దేశ సామాజిక రాజకీయాలపై ఎంబీసీ నేతగా ఠాకూర్ వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. 1970-71, 1977-1979 వరకు ఆయన బిహార్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
‘కర్పూరీ మేథ్స్’ అంటే..
సమాజంలో అట్టడుగువర్గాలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలన్నదే ఈ పథకం. 1978లో బిహార్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ముంగేర్లాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీన్ని ఠాకూర్ అమలులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఇలా..
- ఎంబీసీలు 12 శాతం
- ఈబీసీలు (ఓబీసీల్లోని వారు) 8శాతం
- మహిళలు 3 శాతం
- అగ్రవర్ణాల్లో పేదలు 3 శాతం
బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారతరత్న
ఈ రిజర్వేషన్లు బిహార్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయాధికారాన్ని బీసీలు అందిపుచ్చుకున్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నీతీశ్ కుమార్లు ఠాకూర్కు శిష్యులే కావడం విశేషం. ఈ రిజర్వేషన్ల అమలుతో దేశంలో బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా బీసీల జనాభా గణనకు బిందేశ్వర్ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. దీన్నే మండల్ కమిషన్గా వ్యవహరిస్తుంటారు.
నీతీశ్ పాలనలో..
2005లో జేడీయూ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం నీతీశ్కుమార్ నేతృత్వంలో ఏర్పాటైంది. కర్పూరీ ఠాకూర్ రిజర్వేషన్ విధానం అమలులో ఉన్నప్పటికీ.. మండల్, కమండల్ అంశాలు దీన్ని మరుగునపరిచాయి. నీతీశ్ తిరిగి ఎంబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. ఆర్జేడీ సారథి లాలూ ప్రసాద్ యాదవ్ యాదవ్-ముస్లిం ఫార్ములాను ఢీకొనేందుకు ఎంబీసీని నీతీశ్ అందుకున్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడినవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో నీతీశ్కు అనుకూలమైన ఒక వర్గం ఏర్పడింది. ఇదే ఫార్ములాను దళిత రిజర్వేషన్లలోనూ ప్రవేశపెట్టడంతో జేడీయూ ప్రజాదరణ బాగా పెరిగింది.
భాజపా సైతం..
2020 అసెంబ్లీ ఎన్నికల అనంతరం భాజపా సైతం ఎంబీసీ విధానాన్ని అనుసరించింది. బిహార్లో సంకీర్ణ సర్కారులో భాగంగా డిప్యూటీ సీఎంను ఆ వర్గానికి కేటాయించింది. ఏ రాష్ట్రానికి తగిన విధంగా విధానాలు రూపొందించడం భాజపాకు సాయపడుతోంది. ఇటీవల ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఎంబీసీ విధానాన్ని కమలనాథులు బలంగా ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లడం వారి విజయానికి దోహదపడిందని చెప్పవచ్చు.
కులగణనకు పోటీగా..
బిహార్లో కుల గణన జరిగింది. దేశవ్యాప్తంగా కులాలను లెక్కించాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సమాధానంగా ఎంబీసీ అంశాలన్ని భాజపా ప్రవేశపెట్టింది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. వాస్తవానికి దీన్ని కర్పూరీ ఠాకూర్ ఫార్ములా అంటారు. ఆయన శిష్యుడు నీతీశ్ అందిపుచ్చుకున్నారు. భాజపా సైతం దీన్ని ప్రయోగిస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో బిహార్ కీలకమే
40 లోక్సభ స్థానాలున్న బిహార్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భాజపా ఆశిస్తోంది. గత ఎన్నికల్లో నీతీశ్ జేడీయూ, ఎల్జేపీలతో పొత్తు పెట్టుకొని మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. అయితే జేడీయూ ఇప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబీసీ అంశాన్ని కమలనాథులు బయటకు తీశారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలనేది కమలనాథుల ఆశయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే