Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: బిహార్ రాజకీయాలు మళ్లీ శరవేగంగా మారుతున్నాయి. సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ (Nitish Kumar) తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే అధికారుల మార్పిడి, సిబ్బంది బదిలీలు జరగడంతో.. మహాకూటమి నుంచి బయటకు వచ్చి, తిరిగి భాజపా (BJP) మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఇలా కూటములు మార్చడం ఇది తొలిసారి కాదు. అయితే, లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యం, విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నీతీశ్ మనసులో ఏముందో..!: ఖర్గే
బిహార్ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బిహార్లో బీసీల రిజర్వేషన్లు, కేటగిరీల వారీగా కేటాయించడం.. తదితర అంశాలు కర్పూరీ ఠాకూర్తో ఆ రాష్ట్ర రాజకీయాల్లో మేరునగ శిఖరంగా పేరు వచ్చింది. ఠాకూర్ పంథాను నీతీశ్ అందిపుచ్చుకున్నారు. ఎంబీసీలతో పాటు ఎస్సీల్లోనూ అత్యంత వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ఠాకూర్కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో ఎంబీసీల మన్నన పొందేందుకు భాజపాకు అవకాశం వచ్చింది. దీంతో జేడీయూ అధినేత వెంటనే తన వైఖరి మార్చుకొని తిరిగి కమలదళానికి మద్దతు ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
‘ఇండియా కూటమి’లో పొసగకపోవడం
విపక్షాల కూటమి ‘ఇండియా’లో నీతీశ్కుమార్ది ప్రధాన భూమిక. కొంతకాలంగా ఆయన కూటమి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్పై అపనమ్మకం కలిగింది. కూటమికి ఆయనను కన్వీనర్గా ప్రకటించాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వాయిదా వేయాలని కోరారు. బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం ఈ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ సమ్మతి కావాల్సిందేనని పట్టుబట్టారు. వీటితో విసిగిపోయి కూటమి నుంచి వైదొలగి భాజపా కూటమి వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
లాలన్సింగ్ వ్యవహారం
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్రంజన్ సింగ్ అలియాస్ లాలన్సింగ్ను నీతీశ్ తొలగించి ఆ పదవీ బాధ్యతలు తాను తీసుకున్నారు. వాస్తవానికి సీఎం పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు తేజస్వీకి అప్పగించాలని లాలన్ సూచించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆర్జేడీకి మద్దతు తెలిపేందుకు పార్టీని చీల్చాలని లాలన్ యోచించినట్టు సమాచారం. వీటిని తెలుసుకున్న నీతీశ్ ముందుగా చెక్పెట్టారు. వాస్తవానికి మహాకూటమిలో ఆర్జేడీ 79, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సీపీఎం ఎల్ 12, సీపీఐ 2, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. జేడీయూకు సంఖ్యా బలం తక్కువైనా సీఎం పదవి దక్కడం విశేషం.
లోక్సభ ఎన్నికలు
రానున్న లోక్సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ ప్రాభవం తగ్గే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 45 సీట్లు మాత్రమే రావడం గమనార్హం. రాష్ట్రంలో భాజపా గణనీయశక్తిగా ఎదుగుతోంది. ఆర్జేడీ, ఇండియా కూటమి వైఖరితో విసిగిపోయిన నీతీశ్ తిరిగి భాజపా కూటమికే మొగ్గుచూపుతుండటంతో బిహార్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 40 లోక్సభ సీట్లు ఉన్న బిహార్ హిందీ బెల్ట్లో కీలకమైనది. అందుకనే కమలనాథులు ఈ రాష్ట్రంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.