14న ఏపీ, టీఎస్ రవాణాశాఖ మంత్రుల భేటీ
తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం హైదరాబాద్లో భేటీ కానున్నారు...
హైదరాబాద్: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం హైదరాబాద్లో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై భేటీలో చర్చించనున్నారు. మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, అధికారులు పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ప్రతిష్టంభన ఏర్పడింది. రేపటి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమైతే ఆర్టీసీ బస్సులు గతంలో మాదిరిగా నడిచే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.