బిడ్డ పేరే మర్చిపోయిన మస్క్
ప్రముఖ అమెరికన్ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ విభిన్నంగా ఉంటూ వార్తల్లో నిలుస్తారు.
పాస్వర్డ్లా ఉందంటూ నవ్వేశారు
కాలిఫోర్నియా: ప్రముఖ అమెరికన్ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ విభిన్నంగా ఉంటూ వార్తల్లో నిలుస్తారు. కాగా, అప్పట్లో ఆయన తన కుమారుడికి పెట్టిన చిత్రమైన పేరు నెట్టింట్లో చక్కర్లు కొట్టగా..ఇప్పుడు ఆయనే ఆ పేరు మర్చిపోవడం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..
ఇటీవల జర్మనీలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీని వీక్షించడానికి వచ్చిన సమయంలో మస్క్ ఆకస్మికంగా విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఓ విలేకరి X AE A-12 ఎలా ఉన్నాడంటూ ప్రశ్నించారు. దాంతో తనను దేనికి గురించి అడుగుతున్నారో అర్థం కాక మస్క్ కాస్త తికమకపడ్డారు. మరోసారి అడగాలంటూ కోరారు. ఆ వెంటనే విలేకరి అడిగిన విషయం ఏంటో అర్థమై, పెద్దగా నవ్వేశారు. ‘ఓ మీరు అడిగింది నా కుమారుడి గురించి కదా! అది నాకు ఒక పాస్వర్డ్ చెప్పినట్లు అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈసారి వచ్చేప్పుడు తన కుమారుడిని కూడా తీసుకువస్తానని అన్నారు.
కాగా, మే నెలలో తనకు కుమారుడు జన్మించినట్లు మస్క్ ప్రకటించారు. అలాగే ఆ పిల్లాడికి X AE A-12 అని పేరు పెట్టి ఆశ్చర్యపర్చారు. ఆ పేరు అర్థం ఏంటని అడగ్గా మస్క్ సహచరి గ్రిమెస్ వివరణ ఇచ్చారు. ‘X’ అంటే ఊహకందని మనస్తత్వానికి నిదర్శనం, ‘AE’ అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ‘A-12’ అంటే తమకు ఇష్టమైన ఎస్ఆర్-17 విమానం వేగానికి ప్రతీక, ఇంకా A అంటే ఆర్కేంజిల్ పాటకు గుర్తుగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తరవాత ఎస్ఆర్-17 కాదని, ఎస్ఆర్-71 అంటూ సరిచేశామని తెలిపారు. ఆ పేరును ఎలా పలకాలంటూ అప్పట్లో నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?