చలికాలం... హృద్రోగులూ జరభద్రం!
చల్లని వాతావరణం ఆస్తమాతో బాధపడేవారికేనా హృద్రోగులకూ ఇబ్బందులు కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో గుండెపోటు వచ్చే
ఇంటర్నెట్ డెస్క్: చల్లని వాతావరణం ఆస్తమాతో బాధపడేవారికేనా.. హృద్రోగులకూ ఇబ్బందులు కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఆ వివరాలు మీరూ తెలుసుకోండి...
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన చలి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, దేహంలో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటి సమయంలో రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవటంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితుల వల్ల చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ ముప్పును తప్పించుకుని గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పని సరిగా వెళ్లాల్సి వచ్చినపుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలి. రక్తపోటు మందులను ఎట్టిపరిస్థితులలోనూ మానకూడదు. మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా ఎండకు కూర్చోవాలి. సూర్యుడు ఉదయించిన తరువాతే వాకింగ్కు వెళ్లటం మంచిది. ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?