కొత్త మాస్క్ గురూ.. రాగితో కరోనాకు చెక్!
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్ను నాశనం చేయగల.....
బోస్టన్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్ను నాశనం చేయగల సామర్థ్యంతో ఓ కొత్త తరహా మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాడుతున్న మాస్కులు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అవి గాలిని శుభ్రం చేసి వైరస్ను కట్టడి చేయలేవని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. తాము మరింత ముందుకు వెళ్లి రాగి, ఉష్ణోగ్రత ఆధారంగా కరోనా వైరస్ను నశింపచేసే మాస్కులను కనిపెట్టినట్టు తెలిపారు.
రాగి మాస్క్ ఎలా పనిచేస్తుంది?
ఈ మాస్క్లో ఓ మెష్ (వల) మాదిరిగా రాగి పొర ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాగిలో సహజంగానే యాంటీ వైరల్ లక్షణాలుంటాయి. వీటిని వాడేవారు ఊపిరి పీల్చి వదిలినప్పుడు ఇందులో మెష్ నుంచి గాలి ప్రసరిస్తుందని వివరించారు. ఈ గాలిలో వైరస్ ఉంటే.. ఈ మెష్లో అధిక ఉష్ణోగ్రత వల్ల నశిస్తాయని చెబుతున్నారు. వైరస్ను చంపేందుకు అవసరమైనంత వేడిని సృష్టంచేందుకు 9 వోల్టుల బ్యాటరీ తదితర ఏర్పాట్లు కూడా ఇందులో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రత్యేక మాస్కును మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చని వివరించారు.
ఎవరికి ఉపయోగం?
ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, సామాజిక దూరం పాటించటం వీలు కాని విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ మాస్కులు అత్యంత ఉపయోగమని అంటున్నారు. బస్సులు, రైళ్లు తదితర జనంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు.ఈ మాస్క్ల నమూనాలను రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించే పని మొదలైందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?