మరీ ఇంత ప్రేమా? విడాకులు ఇప్పించండి ప్లీజ్!
భర్త తనపై ప్రేమ చూపించడం లేదని విడాకులు తీసుకునే వారిని చూస్తుంటాం.. తరచూ గొడవ పడుతున్నాడని విడిపోవాలని అనుకుంటున్న వారి గురించి విని ఉంటాం.
లఖ్నవూ: భర్త తనపై ప్రేమ చూపించడం లేదని విడాకులు తీసుకునే వారిని చూసుంటాం. తరచూ గొడవ పడుతున్నాడని విడిపోవాలని అనుకుంటున్న వారి గురించి విని ఉంటాం. అయితే ఈ యూపీ మహిళ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈమె విడాకుల కోసం చెప్పిన కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
తన భర్త తనపై నిత్యం ప్రేమ కురిపించాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. అయితే ఈ మహిళ మాత్రం ప్రేమ మరీ ఎక్కువైందని తన భర్త నుంచి విడాకులు అడుగుతోంది. తనతో గొడవ పడట్లేదని విడిపోవాలని కోరుకుంటోంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ మహిళకు 18 నెలల క్రితం వివాహమైంది. ఆ భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెను సంతోషపెట్టేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇదే వారిద్దరి మధ్య అసలు సమస్యగా మారింది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని ఆమె ఏకంగా విడాకులు కావాలని స్థానిక షరియా కోర్టును ఆశ్రయించింది.
‘నాకు ఇంటి పనుల్లో సహాయపడతాడు. వంట చేసి పెడతాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమిస్తాడు. నాపై ఎప్పుడూ కోప్పడడు. కానీ.. నాకు అతడితో గొడవపడాలని ఉంటుందిగా. ఇంత ప్రేమను భరించలేను. ఇలాంటి వాతావరణంలో నేను ఇమడలేకపోతున్నా’ అంటూ ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన కారణం విని ఆమె పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ సమస్యను భార్యభర్తలే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో ఆమె స్థానిక పంచాయితీ పెద్దలనూ ఆశ్రయించింది. వారు కూడా అంత ప్రేమగా చూసుకునే భర్తతో ఎందుకు విడిపోతావని చెప్పి పంపించివేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..