కొందరి పైనే కొవిడ్ ప్రభావం ఎందుకు ?
కొవిడ్ బాధితుల్లో కొంతమంది తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతుంటే, మరికొందరిలో అసలు వైరస్ సోకిన లక్షణాలే కనిపించటం లేదు. కొంతమంది మరణిస్తుంటే, మరికొందరు సాధారణ వ్యక్తుల మాదిరిగానే తిరుగుతున్నారు. మరి వైరస్ తీవ్రతలో ఇంతటి వైవిధ్యానికి కారణం ఏమిటీ?
ఇంటర్నెట్ డెస్క్ : కొవిడ్ బాధితుల్లో కొంతమంది తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతుంటే, మరికొందరిలో అసలు వైరస్ సోకిన లక్షణాలే కనిపించటం లేదు. మరి వైరస్ తీవ్రతలో ఇంతటి వైవిధ్యానికి కారణం ఏమిటీ? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం గురించి పరిశోధకులు ఏమంటున్నారు?
కరోనా వైరస్ తీవ్రత వెనుక జన్యుపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయట. బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు కొవిడ్ తీవ్రతలో హెచ్చుతగ్గులకు జన్యుపరమైన అంశాలకు మధ్యం సంబంధం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొవిడ్ బాధితుల్లో లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయి. కొంతమందిలో తేలికపాటి ప్లూ లక్షణాలు కనిపిస్తుంటే మరికొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వంటి తీవ్రస్థాయి సమస్యలు కనిపిస్తున్నాయి. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిలో కరోనా కారణంగా పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు.
కొవిడ్ నేపథ్యంలో చైనా, యూరప్, అమెరికా దేశాల నుంచి గత పదేళ్లుగా సేకరించిన హ్యూమస్ జీనోమ్ కోడ్ను పరిశోధకులు ఇటీవల పరిశీలించారు. 100 టెరాబైట్లు పరిమాణం కలిగిన ఈ జీనోమ్ కోడ్ను వివిధ ప్రాంతాలతో సంబంధం ఉన్న అన్ని ప్రోటీన్లు, జీవక్రియల సమాహారమైన లైబ్రరీగా పరిశోధకులు పేర్కొంటున్నారు. కొవిడ్ వ్యాధితో సంబంధం ఉన్న ఒక జన్యు సంబంధమైన హాట్స్పాట్ను పరిశోధకులు పరిశీలించినపుడు, అది ఒక ప్రోటీన్తో ముడిపడి ఉందని గుర్తించారు. ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే కరోనా ఇన్ఫెక్షన్ను ఈ ప్రోటీన్ ఎలా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టంగా తెలియటం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదేమైనా తాజా పరిశోధన కొవిడ్ చికిత్సల్లో జన్యు పరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. పరిశోధన వివరాలు న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఇటీవలే ప్రచురితం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్