Hyderabad: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై కేసు

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)పై అల్వాల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 06 Mar 2024 23:12 IST

సికింద్రాబాద్‌: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)పై అల్వాల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. అల్వాల్‌ పురపాలక కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారాస శ్రేణులు బుధవారం ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్ రెడ్డితో ఎమ్మెల్యే, నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం తన వాహనాన్ని అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డీసీ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని