CT scan: 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్రేలతో సమానం
ప్రస్తుతం కరోనా బారిన పడివారికి కొందరు వైద్యులు ఎడాపెడా సిటీస్కాన్కు సిఫారసు చేస్తున్నారు. యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్గా
కరోనా పేషెంట్లకు ఎయిమ్స్ చీఫ్ సలహా
న్యూదిల్లీ: ప్రస్తుతం కరోనా బారిన పడివారు, యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్గా వచ్చిన వారు భయంతో సిటీస్కాన్ చేయించుకుంటున్నారు. సిటీస్కాన్ వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా హెచ్చరించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడేవారికి సిటీస్కాన్ అక్కర్లేదని స్పష్టం చేశారు. కొవిడ్ పాజిటివ్గా వచ్చిన వారు సిటీస్కాన్ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
‘ఒక సిటీస్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్రేలతో సమానం. తరచూ సిటీస్కాన్ చేయడం వల్ల యువత క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శరీరం రేడియేషన్కు గురికావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుంది. దయచేసి స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉండి, సాధారణ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నవారు సిటీస్కాన్ చేయించుకోవద్దు’అని గులేరియా సూచించారు. కేవలం ఆస్పత్రిలో చికిత్స పొందేవారు మాత్రమే, అది కూడా వైద్యుల సూచనల మేరకే సిటీ స్కాన్ చేయించుకోవాలని అన్నారు. అయితే అంతకుముందు చెస్ట్ ఎక్స్రేకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వల్ప లక్షణాలతో పాటు, అసలు లక్షణాలు లేని వారు కూడా సిటీస్కాన్ చేయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో గులేరియా ఈ హెచ్చరిక చేశారు.
అదే విధంగా కరోనా వైరస్ సోకగానే స్టెరాయిడ్స్ తీసుకోవద్దని కూడా డా.రణదీప్ గులేరియా సూచించారు. వైరస్ ప్రారంభ దశలోనే స్టెరాయిడ్లను తీసుకోవడం వల్ల వైరల్ రిప్లికేషన్ జరిగే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన వైరల్ న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు వైరస్ ప్రారంభ దశలో స్టెరాయిడ్స్ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రెమ్డెసివిర్, ప్లాస్మా, టోసిలిజుమాబ్ వంటి ఔషధాలు అత్యవసర వినియోగానికి మాత్రమేనని స్పష్టంచేశారు. వాటిని సరైన సమయంలో వాడటం ముఖ్యమని తెలిపారు.
హోం ఐసోలేషన్లోఉంటున్నవారు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఆక్సిజన్ స్థాయి 93 లేదా అంతకంటే తగ్గినా, ఛాతీ నొప్పి, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తప్పని సరిగా వ్యాక్సిన్ ప్రైమింగ్ డోస్, బూస్టర్ డోస్ రెండూ తీసుకోవాలని సలహా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన