వాయుకాలుష్యంతో గర్భస్రావం ముప్పు
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లోని గర్భిణులపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని సర్వేలో తేలింది. ఈ మేరకు మోడెలింగ్ స్టడీ నివేదికలు లాన్సెంట్ ప్లానేటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
వెల్లడించిన లాన్సెంట్ సర్వే
దిల్లీ: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లోని గర్భిణులపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని సర్వేలో తేలింది. ఈ మేరకు మోడెలింగ్ స్టడీ నివేదికలు లాన్సెంట్ ప్లానేటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు ప్రమాణాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వాయుకాలుష్యం నమోదవుతుందని తెలిపారు. దీంతో సంవత్సరంలో సుమారు 3 లక్షలకు పైగా గర్భస్రావాలు, శిశు మరణాలు ఈ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని వెల్లడించారు. 29శాతం గర్భస్రావాలకు ఈ వాయుకాలుష్యమే కారణమని తెలిపారు.
‘‘దక్షిణాసియాలో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంది. అదే విధంగా ఈ ప్రాంతం ప్రపంచంలోని కాలుష్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. మా సర్వేలో తేలిందేంటంటే వాయుకాలుష్యం గర్భస్రావాలు, గర్భధారణ సమయంలో సమస్యలకు ప్రధాన కారణంగా ఉంది. దీనిపై వెంటనే సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.’’ అని ఈ సర్వేలో సభ్యురాలైన టావో సూ తెలిపారు. ‘‘ గర్భస్రావం జరగటం, జన్మించిన వెంటనే శిశువు మరణించడం వంటివి మహిళలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. మానసికంగా, శారీరకంగా ఇంకా ఆర్థికంగా కూడా వారు చాలా కోల్పోతారు. దీని ద్వారా వారు డిప్రెషన్కు గురయ్యే అవకాశం కూడా ఉంది.’’ అని చైనీస్ అకాడెమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన టియాంజిన్ గువాన్ తెలిపారు. వాయుకాలుష్యం వల్ల గర్భాన్ని పోగొట్టుకోవడం అనేది భారత్, పాకిస్థాన్ వంటి ప్రాంతాల్లో చాలా సాధారణంగా జరుగుతోందని ఈ సర్వే వెల్లడిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, 30 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.
ఈ సర్వే కోసం 1998 నుంచి 2016 వరకూ అన్ని రకాల ఆరోగ్య నివేదికలు, వాతావరణ మార్పులను పరిశీలించినట్లు వారు వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం వాయుకాలుష్యంతో గర్భాన్ని పోగొట్టుకున్న వారిలో భారత్లో 77శాతం, పాకిస్థాన్లో 12 శాతం, 11శాతం బంగ్లాదేశ్ మహిళలు ఉన్నారు. గాలిలో 10 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లో స్మాల్పర్టిక్యులర్ మాటర్ పెరిగే కొద్దీ మహిళల్లో గర్భం కోల్పోయేందుకు 3 శాతం అవకాశముందని వారు తెలిపారు. ప్రపంచారోగ్య సంస్థ నిబంధనలు పాటిస్తూ వాయుకాలుష్యాన్ని అదుపులో ఉంచితే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని వారు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..