ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక
‘ప్రేమికుల దినోత్సవం రోజు మీకు ప్రియమైన వ్యక్తులకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వారిని సురక్షితంగా ఉంచేందుకు ఒక వ్యాక్సిన్ను అందించండి’.. అంటూ వినూత్నంగా సాగుతోంది ఓ ప్రకటన.
విభిన్న ప్రకటనను ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర
దిల్లీ: ‘ప్రేమికుల దినోత్సవం రోజు ప్రియమైన వ్యక్తులకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వారిని సురక్షితంగా ఉంచేందుకు ఒక వ్యాక్సిన్ను అందించండి’.. అంటూ వినూత్నంగా సాగుతోంది ఓ ప్రకటన. ఫైజర్ సంస్థ లోగోతో ఉన్న ఈ పేరడీ ప్రకటనలో వ్యాక్సిన్ను ప్రేమికుల దినోత్సవ బహుమతిగా ఇవ్వమంటోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ప్రకటన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చిందట. వెంటనే ఆయన తన ట్విటర్ ఖాతాలో దాన్ని పోస్టు చేశారు. ఆ పోస్టులో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాను ప్రస్తావిస్తూ..మీ కోసం అడ్వర్టైజింగ్ బ్రీఫ్ సిద్ధంగా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ ప్రకటనలో ఏముందంటే.. ఇక వ్యక్తి తన స్నేహితురాలికి ఉంగరం బదులుగా వ్యాక్సిన్ షాట్ను అందిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ ప్రకటన చివరిలో ‘టీకా తీసుకోండి..ప్రేమతో..’ అంటూ ముగుస్తోంది.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. నిమిషానికి 5వేల వ్యాక్సిన్ డోసులను తాము తయారు చేస్తున్నట్లు సీరం సీఈవో అదర్పూనావాలా గతంలో తెలిపారు. ఇప్పటికే ఈ టీకాలను కోరుతూ అనేక దేశాలు తమను సంప్రదించాయని ఆయన వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ ఈ ప్రకటనను మొదటగా పోస్టు చేయగా, ఇప్పటి వరకూ లక్షల మంది చూశారు. ఈ ప్రకటనపై నెటిజన్లు వాలంటైన్ టీకా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి..
కేంద్రం, ట్విటర్కు సుప్రీం నోటీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM