Ap Covid Update: కొత్తగా 1627 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షించగా.. 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం

Updated : 26 Jul 2021 17:33 IST

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షించగా.. 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి పెరిగింది. తాజాగా 17 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,017 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు వెల్లడించింది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని