Marriage: వేదికపైనే వరుడి చెంప పగులగొట్టిన వధువు.. ఆపై రచ్చరచ్చ

వివాహ వేదికపైనే వరుడి చెంప పగలగొట్టింది వధువు. ఆ తర్వాత కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది......

Published : 19 Apr 2022 02:43 IST

లఖ్‌నవూ: వివాహ వేదికపైనే వరుడి చెంప పగలగొట్టింది వధువు. ఆ తర్వాత కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని హమిర్​పుర్​లో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. లాల్​పురా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని స్వాసా బుడ్జ్‌​ గ్రామానికి చెందిన మనోహర్​ అహిర్వార్​ కుమార్తె రీనాకు.. జలౌన్​ జిల్లా  చమారీ గ్రామానికి చెందిన రవికాంత్​ అహిర్వార్​తో వివాహం నిశ్చయించారు. ఆదివారం రాత్రి పెళ్లి బరాత్​ వధువు ఇంటికి చేరుకుంది. వారికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో భాగంగా కాబోయే వధూవరులు పూల దండలు మార్చుకోవాల్సి ఉంటుంది.

అయితే, మెడలో పూలమాల వేయగానే కోపంతో ఉడికిపోయిన వధువు.. వరుడి చెంప చెల్లుమనిపించింది. పలుమార్లు చెంపపై కొట్టి.. కోపంగా స్టేజి దిగి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైంది అని ఆరా తీయగా.. వరమాలకు సిద్ధం కాకముందే మాల వేశాడని, అందుకే కొట్టినట్లు తెలిపింది వధువు. అయితే ఈ ఘటన ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఘర్షణ తలెత్తగా పలువురుకి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.  రెండు కుటుంబాలను సముదాయించి ఓ అంగీకారంతో సోమవారం ఉదయం వివాహ తంతు పూర్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని