Marriage: వేదికపైనే వరుడి చెంప పగులగొట్టిన వధువు.. ఆపై రచ్చరచ్చ
వివాహ వేదికపైనే వరుడి చెంప పగలగొట్టింది వధువు. ఆ తర్వాత కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది......
లఖ్నవూ: వివాహ వేదికపైనే వరుడి చెంప పగలగొట్టింది వధువు. ఆ తర్వాత కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తర్ప్రదేశ్లోని హమిర్పుర్లో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. లాల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాసా బుడ్జ్ గ్రామానికి చెందిన మనోహర్ అహిర్వార్ కుమార్తె రీనాకు.. జలౌన్ జిల్లా చమారీ గ్రామానికి చెందిన రవికాంత్ అహిర్వార్తో వివాహం నిశ్చయించారు. ఆదివారం రాత్రి పెళ్లి బరాత్ వధువు ఇంటికి చేరుకుంది. వారికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో భాగంగా కాబోయే వధూవరులు పూల దండలు మార్చుకోవాల్సి ఉంటుంది.
అయితే, మెడలో పూలమాల వేయగానే కోపంతో ఉడికిపోయిన వధువు.. వరుడి చెంప చెల్లుమనిపించింది. పలుమార్లు చెంపపై కొట్టి.. కోపంగా స్టేజి దిగి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా షాక్కు గురయ్యారు. ఏమైంది అని ఆరా తీయగా.. వరమాలకు సిద్ధం కాకముందే మాల వేశాడని, అందుకే కొట్టినట్లు తెలిపింది వధువు. అయితే ఈ ఘటన ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఘర్షణ తలెత్తగా పలువురుకి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. రెండు కుటుంబాలను సముదాయించి ఓ అంగీకారంతో సోమవారం ఉదయం వివాహ తంతు పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..