TS News: వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజ: హరీశ్రావు
కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
చార్మినార్ యునానీ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. చార్మినార్ యునానీ ఆస్ప్రతిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి బూస్టర్ డోస్ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని చెప్పారు. మొదటి డోస్ సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15-18 ఏళ్ల మధ్యవారిలో కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి వివరించారు. వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
యునానీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించామని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హరీశ్రావు చెప్పారు. నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మంజూరయ్యేలా చేస్తామన్నారు. ఆస్పత్రిలోని ఖాళీలను పూరించేందుకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. రోగులకు వీలైనంత వరకు ఇక్కడే సేవలందించాలని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ వ్యాక్సినేషన్లో ముందంజలో ఉన్న వైద్యఆరోగ్యశాఖకు అభినందనలు తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని.. దాంతోపాటు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్తో దుష్పరిణామాలు వస్తాయన్నది అవాస్తవమని.. అలాంటి మాటలు నమ్మొద్దన్నారు. యునానీ ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావును అక్బరుద్దీన్ కోరారు.
హెల్త్కేర్, ఫ్రంట్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. గతంలో తీసుకున్నవారికి అదే రిజిస్ట్రేషన్తో వ్యాక్సిన్ వేస్తున్నారు. రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారితో పాటు 60 ఏళ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..