
Cm Jagan: దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్కు సీబీఐ కోర్టు అనుమతి
హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు జగన్ తెలిపారు. అయితే జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దావోస్ వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సీఎం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సును ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని బృందం ‘ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలు... ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న ప్రధాన అంశంతో సదస్సులో పాల్గొననుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ సదస్సుకు సంబంధించి రాష్ట్ర లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్లెట్ను గురువారం ఆవిష్కరించారు. ‘‘మన రాష్ట్రం తరఫున ఏపీ పెవిలియన్ థీమ్ ఏర్పాటు చేసి, 18 అంశాలను ప్రదర్శిస్తాం. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్ వేదికగా అందరికీ తెలియజేస్తాం. దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో మేమంతా సమావేశం కాబోతున్నాం. సీఎం వస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది’ అని మంత్రి అమర్నాథ్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్ 284 ఆలౌట్.. టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
-
Politics News
Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
World News
Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!
-
Politics News
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి