Cm Jagan: దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్కు సీబీఐ కోర్టు అనుమతి
స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్
హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు జగన్ తెలిపారు. అయితే జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దావోస్ వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సీఎం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సును ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని బృందం ‘ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలు... ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న ప్రధాన అంశంతో సదస్సులో పాల్గొననుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ సదస్సుకు సంబంధించి రాష్ట్ర లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్లెట్ను గురువారం ఆవిష్కరించారు. ‘‘మన రాష్ట్రం తరఫున ఏపీ పెవిలియన్ థీమ్ ఏర్పాటు చేసి, 18 అంశాలను ప్రదర్శిస్తాం. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్ వేదికగా అందరికీ తెలియజేస్తాం. దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో మేమంతా సమావేశం కాబోతున్నాం. సీఎం వస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది’ అని మంత్రి అమర్నాథ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..