హ్యాకింగ్ నేపథ్యంలో ట్విటర్కు కేంద్రం నోటీసులు?
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్కు గురవ్వడంతో భారత సైబర్ భద్రతా నోడల్ ఏజెన్సీ సెర్ట్-ఇన్ అప్రమత్తమైంది. ట్విటర్కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని...
(హ్యాకర్లు దాడి చేశారని ట్విటర్ ప్రకటిస్తున్న చిత్రం)
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్కు గురవ్వడంతో భారత సైబర్ భద్రతా నోడల్ ఏజెన్సీ సెర్ట్-ఇన్ అప్రమత్తమైంది. ట్విటర్కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశించింది. ప్రస్తుత సైబర్ దాడి వల్ల ఎంత మంది భారతీయుల సమాచారంపై ప్రభావం పడిందో వెల్లడించాలని కోరింది.
హానిచేసే ట్వీట్లనూ, లంకెలనూ ఎంతమంది భారతీయులు సందర్శించారో సమాచారం ఇవ్వాలని ట్విటర్ను సెర్ట్-ఇన్ కోరిందని తెలిసింది. హ్యాకింగ్కు గురైన వారికి, ఇతరులు యాక్సెస్ చేశారన్న విషయం చెప్పారా అని ప్రశ్నించింది. భారతీయుల సమాచారానికి ఎంత ముప్పు ఉంది? ఏ రకంగా హ్యాకర్లు దాడి చేశారు? ముప్పు తగ్గిస్తూ తీసుకున్న చర్యల గురించి సెర్ట్-ఇన్ అడిగిందని తెలుస్తోంది.
మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విటర్పై శుక్రవారం అంతర్జాతీయంగా సైబర్ దాడి జరిగింది. జో బైడెన్, బరాక్ ఒబామా, జెఫ్ బెజోస్, బిల్గేట్స్, ఎలన్ మస్క్ వంటి ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేశారు. కొన్ని ఖాతాల పాస్వర్డులు మార్చారు. కొన్నింటి సమాచారాన్ని పూర్తిగా చోరీ చేశారు. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కొందరు నేతల ప్రైవేటు సందేశాలనూ తస్కరించారని తెలిసింది. అయితే తమ ఉద్యోగులను నియంత్రించి కొన్ని రహస్య విషయాలను తెలుసుకొని హ్యాకర్లు దాడి చేశారని ట్విటర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు