Chandrababu: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలి: చంద్రబాబు

తెలుగు ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం.

Updated : 09 Apr 2024 10:15 IST

అమరావతి: తెలుగు ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. నేడు మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’’ అని చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు.

‘తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నవ వసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలి. ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి పాటుపడదాం’’

- నారా లోకేశ్‌

‘‘ఉగాది పండగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించేలా శుభాలు కలగాలి’’

-నందమూరి బాలకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని