శివాజీ టెర్మినస్‌: ఈ రైల్వేస్టేషన్‌ ప్రత్యేకతలు తెలుసా?

దేశవ్యాప్తంగా లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది రైల్వేశాఖ. దేశంలో

Updated : 05 Mar 2021 04:50 IST

ముంబయి: దేశవ్యాప్తంగా లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది రైల్వేశాఖ. దేశంలో ఒక్కో రైల్వేస్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే, మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు ఉన్న ప్రత్యేకతలే ఆ స్టేషన్‌కు గోల్డ్‌ సర్టిఫికేషన్‌ వచ్చేలా చేశాయి. సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైల్వేస్టేషన్‌ అత్యాధునిక హంగులతో పాటు, పర్యావరణానికి మేలు చేసేలా, ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్‌ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందిన  మొదటి రైల్వేస్టేషన్‌గా నిలిచింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ ప్రత్యేకతలు

* సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేశారు.

* వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.

* మొత్తం స్టేషన్‌లో 15శాతం చెట్లు, చిన్న చిన్న పార్కులు, లాన్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆర్గానిక్‌ పద్ధతుల్లో పెంచుతున్నారు.

* స్టేషన్‌లో మొత్తంలో 245 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు.

* స్టేషన్‌ మొత్తంలో 100శాతం ఎల్‌ఈడీలను అమర్చారు.

* స్టేషన్‌లో ఉన్న వివిధ ఆఫీస్‌లు, వెయిటింగ్‌ హాళ్లలో ఎక్కువగా సెన్సార్లు ఉపయోగించారు.

* ప్రతి చోటా బీఎల్‌డీసీ, హెచ్‌వీఎల్‌ఎస్‌ ఫ్యాన్స్‌ను అమర్చారు.

* ఎలివేటర్లు, ఫ్లాట్‌ఫామ్‌లు, స్టేషన్‌ ఏరియా, ట్రాక్స్‌, రూఫ్‌ టాప్‌లు, పార్కింగ్‌ ప్రాంతం, వెయింటింగ్‌ హాల్‌, షట్టర్స్‌ ఇలా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి మెషీన్లు ఉన్నాయి.

* స్టేషన్‌ను శుభ్రం చేయడానికి బయో డీగ్రేడబుల్‌, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.

* వైఫై, పర్యాటక సమాచారం, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లు, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం ఇలా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

* పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను వినియోగించవద్దంటూ స్టేషన్‌లో ప్రకటనలు కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని