TS News: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కరోనా
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘‘స్వల్ప కొవిడ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘‘స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించాయి. పరీక్ష ద్వారా కొవిడ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా’’ అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో దాదాపు 80 మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో దాదాపు 180 మంది వరకు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన పడినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. నీలోఫర్ ఆసుపత్రిలోనూ 25 మందికి కొవిడ్ సోకినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వైద్య సిబ్బందిపై మహమ్మారి పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు: వాతావారణ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు