Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-11-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 09 Nov 2021 05:50 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేయండి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. దుర్గారాధన శుభప్రదం.

అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధు,మిత్రుల సలహాలు సూచనలు మేలు చేస్తాయి. ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. శివారాధన చేస్తే మంచిది.

మంచి కాలం. మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. మనఃసౌఖ్యం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివపార్వతుల ఆరాధన శక్తిని ఇస్తుంది.

శ్రమ ఫలిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠనం శుభకరం. 

సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులు, పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.

 

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ, అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.

 మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.

మనః స్సౌఖ్యం ఉంటుంది. ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని