Dubai: వామ్మో..! కారు నంబరు ప్లేట్ అక్షరాల రూ.70 కోట్లు...
ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. కొందరికి ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ ఎక్కువ.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. కొందరికి ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ ఎక్కువ. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. అందులోనూ సింగిల్ డిజిట్ నంబర్ అయితే ఇక చెప్పేపని లేదు. సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు తమకు నచ్చిన నంబర్ ప్లేట్ల కోసం ఎక్కువగా వేలంలో పాల్గొంటారు. ఇటీవల చండీగఢ్లో ఓ వ్యక్తి తన రూ.71వేల స్కూటీ కోసం రూ.15 లక్షలు పెట్టి మరీ ఫ్యాన్సీ నంబర్ను సొంతం చేసుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో ఎంతగానో వైరలైంది. ఇప్పుడు తాజాగా దుబాయ్కి చెందిన ఓ వ్యక్తి తన కారు కోసం ఏకంగా 35 మిలియన్ల దిర్హమ్లు (రూ.70 కోట్లుకు పైగానే) ఖర్చుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ ఛారీటీ సంస్థ నిర్వహించిన వేలంలో పాల్గొన్న అతడు ‘AA8’ అనే సింగిల్ డిజిట్ నంబర్ కోసం అంత మొత్తం ఖర్చు చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే ఛారిటీ సంస్థ నిర్వహించిన వేలంలో ‘AA9’ అనే నెంబర్ ప్లేట్ రూ.79 కోట్లకు పలికి రికార్డు సృష్టించింది. 50 దేశాల్లోని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ‘1 బిలియన్ మీల్స్’ ప్రచారానికి మద్దతుగా ‘మోస్ట్ నోబల్ నంబర్స్’ అనే ఛారిటీ సంస్థ ఈ వేలంలో రూ.110 కోట్లను సమీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య