అణచివేస్తే ఉద్యమం మరింత ఉద్ధృతం
రేపటి నుంచి పోలీస్స్టేషన్లకు వెళ్లి పూలు, పండ్లు ఇచ్చి తమ శాంతియుత పోరాటానికి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సెక్షన్ 144 పేరిట ఉద్యమాన్ని
అమరావతి పరిరక్షణ సమితి నేతల హెచ్చరిక
విజయవాడ: రేపటి నుంచి పోలీస్స్టేషన్లకు వెళ్లి పూలు, పండ్లు ఇచ్చి తమ శాంతియుత పోరాటానికి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సెక్షన్ 144 పేరిట ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఐకాస నేతలు ఆరోపించారు. అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మహిళలను కులంపేర్లు అడిగి కించపరుస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల ఆలోచన విరమించుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని నేతలు తేల్చిచెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
అమరావతి కోసం పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాటం చేస్తుంటే సెక్షన్ 144 ద్వారా అణగదొక్కాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఐకాస నేత శివారెడ్డి అన్నారు. ఇది పోలీసులు రాజ్యమా.. ప్రజా రాజ్యమా
పోలీసులు ఆలోచించాలన్నారు. వైకాపా నేతలు ఏ ర్యాలీ చేసినా ఎటువంటి అనుమతీ అక్కర్లేదని, తాము ఇంటి ముందు క్యాండిల్ ర్యాలీ చేసినా ఫైర్ పర్మిషన్ పేరు చెప్పి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము నిబంధనల ప్రకారం అనుమతి అడిగినా ఇవ్వడం లేదని, వైకాపా కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఐకాస నేత గద్దె తిరుపతి రావు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..