‘తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు!’
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై...
ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామన్న తితిదే ఛైర్మన్
తిరుమల: తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక ఈ అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామన్నారు. తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్ రైల్ తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని.. తీగలపై నడిచే రైలు వంటివాటి జోలికి వెళ్లడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని సుబ్చారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళ్తోందని.. దాన్ని మోడల్గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ పేరుతో ట్విటర్లో జరుగుతున్న ప్రచారాన్ని సుబ్బారెడ్డి ఖండించారు. తితిదేకు చెందిన రూ. 2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ అజిత్ డోభాల్ పేరుతో ప్రచారం జరుగుతోందని.. అది అజిత్ ఢోబాల్ ట్విటర్ ఖాతాయే కాదన్నారు. అది నకిలీ ఖాతాగా తితిదే అధికారులు పరిశీలనలో తేలిందని చెప్పారు. దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతో చేసే దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని.. నకిలీ ఖాతాలతో ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. తిరుమలలో త్వరలోనే సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.