దేశంలో తొలి ప్రైవేట్‌ రైలు జూన్‌ 4 నుంచి చుక్‌ చుక్‌

దేశంలోనే తొలి ప్రైవేట్‌ రైలు సర్వీసు జూన్‌ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది.

Updated : 08 May 2024 09:16 IST

ఈటీవీ భారత్‌: దేశంలోనే తొలి ప్రైవేట్‌ రైలు సర్వీసు జూన్‌ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ప్రధానలక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్‌ గౌరవ్‌యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయొచ్చు. 2 స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లు, 11 థర్డ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంటాయి. స్టార్‌ హోటల్‌ వసతి, భోజన సదుపాయంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్‌ ప్యాకేజీలను కూడా అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని