వాట్సప్ వీడియో స్టేటస్ ఇక 15 సెకన్లే!
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ లేదా ఇతర పనుల్ని చక్కబెట్టుకోవడానికి ఆన్లైన్ని.....
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ లేదా ఇతర పనుల్ని చక్కబెట్టుకోవడానికి ఆన్లైన్ని వినియోగిస్తుంటే మరికొంతమంది కాలక్షేపం కోసం నెట్ని తెగ వాడేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వేగం తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఇన్స్టంట్ మెసెంజర్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 30 సెకన్లుగా ఉన్న స్టేటస్ వీడియోల నిడివిని 15 సెకన్లకు కుదించింది. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ఇది ఇండియన్ యూజర్లకు మాత్రమే వర్తించనుంది.
ఇంట్లో ఖాళీగా ఉంటున్న నెటిజన్లు వాట్సాప్ స్టేటస్లలో విపరీతంగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం పడుతోంది.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నెట్ని అధికంగా వినియోగించడం వల్ల వేగం కూడా తగ్గుతుందని.. ఇతర ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉండడం కూడా మరో కారణమని తెలుస్తోంది. ఇప్పటికే నెట్ వినియోగం పెరగడంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సైట్లు, యాప్లు నెట్ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, యూట్యూబ్, ఫేస్బుక్ వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..