విదేశీ విద్యపై మారిన భారతీయుల నిర్ణయం

విదేశాల్లో విద్యనభ్యసించాలని కోరుకుంటున్న 48% పైగా భారతీయ విద్యార్థుల నిర్ణయంపై కొవిడ్‌-19 ప్రభావం చూపించిందని క్వాక్వారెలి సైమండ్స్‌ (క్యూఎస్‌) నివేదిక తెలిపింది. విదేశీ విద్యకు ఖర్చులు పెరగడం, రాబడి తగ్గడం, వైరస్‌ ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడమే ఇందుకు కారణమని....

Published : 13 May 2020 18:57 IST

ముంబయి: విదేశాల్లో విద్యనభ్యసించాలని కోరుకుంటున్న 48% పైగా భారతీయ విద్యార్థుల నిర్ణయంపై కొవిడ్‌-19 ప్రభావం చూపించిందని క్వాక్వారెలి సైమండ్స్‌ (క్యూఎస్‌) నివేదిక తెలిపింది. విదేశీ విద్యకు ఖర్చులు పెరగడం, రాబడి తగ్గడం, వైరస్‌ ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ‘భారతీయ విద్యార్థుల చలన నివేదిక 2020: ఉన్నత విద్య అవకాశాలపై కొవిడ్‌-19 ప్రభావం’ పేరుతో క్యూఎస్‌ ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని విశ్వవిద్యాలయాలకు ఈ సంస్థ రేటింగ్‌ ఇస్తుంటుంది.

‘విదేశాల్లో చదవాలని భావించిన 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కొవిడ్‌-19 ప్రభావం చూపించింది. ఇప్పటికే పెరిగిన విదేశీ విద్య ఖర్చులకు తోడు రాబడి తగ్గడం, కొవిడ్‌-19 ప్రభావంతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం విద్యార్థుల్లో మార్పుకు కారణంగా నిలిచింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథెమ్యాటిక్స్‌ (STEM- స్టెమ్‌) ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌ ఉన్నప్పటి నాన్‌ స్టెమ్‌ విభాగాలకు డిమాండ్‌ తగ్గింది. దీంతో వారు నిర్ణయాలను మార్చుకున్నారు’ అని నివేదిక తెలిపింది.

ఉన్నత విద్యా సంస్థలు ఈ-లెర్నింగ్‌ పద్ధతులకు అలవాటు పడతాయని నివేదిక అంచనా వేసింది. అయితే మరిన్ని మార్పులు రావడానికి మాత్రం కొంత సమయం పడుతుందని వెల్లడించింది. ప్రయాణాలపై వైరస్‌ ప్రభావం ఉండటంతో భోదనా పద్ధతులు మార్పు వస్తాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని