మంచి అలవాట్లకు కారణమైన కరోనా!
చైనాలో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ మనుషుల్లో కొంత మార్పుకూ కారణమవుతోంది. జీవన శైలి, ఆహార అలవాట్లు, ఆధ్మాత్మికత, మానసిక వైఖరిలో మార్పులు తీసుకొస్తోంది. కొవిడ్-19 నుంచి కోలుకొని ఇంటికెళ్లిన కొందరు పెద్ద వయస్కులు చెబుతున్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.....
కొవిడ్-19 నుంచి కోలుకున్న వృద్ధుల్లో మార్పులు
ఔరంగాబాద్: చైనాలో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ మనుషుల్లో కొంత మార్పునకూ కారణమవుతోంది. జీవన శైలి, ఆహార అలవాట్లు, ఆధ్యాత్మికత, మానసిక వైఖరిలో మార్పులు తీసుకొస్తోంది. కొవిడ్-19 నుంచి కోలుకొని ఇంటికెళ్లిన కొందరు పెద్ద వయస్కులు చెబుతున్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణంలోని కొవిడ్-19 బాధితులు తమ జీవితం, వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను వివరించారు. ‘సాధారణంగా నా వయసు వ్యక్తులు జీవనశైలి మార్చుకొనేందుకు ఇష్టపడరు. కానీ, కరోనా వైరస్ నా పాత అలవాట్లను మార్చుకొనేలా చేసింది. నాకు సరిపడనప్పటికీ దశాబ్దాలుగా నేను డైట్ను మార్చుకోలేదు. వైరస్ సోకిన తర్వాత మార్చాలని నిర్ణయించుకున్నా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా. మారుతున్న పరిస్థితులకు కూడా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా’ అని 66 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆయన కొలుకొని డిశ్చార్జి అయ్యారు.
లాక్డౌన్ సమయంలో ఇంటి గడప దాటకున్నా తనకెలా వైరస్ సోకిందో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని 60 ఏళ్ల వృద్ధురాలు తెలిపారు. మధుమేహంతోనూ బాధపడుతున్న ఆమె జూన్ 1న ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లింది. ‘నేనిప్పుడు మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన జీవితం గడపాలని భావిస్తున్నా. ప్రస్తుతం పోషక విలువలు ఉన్న ఆహారాన్నే తింటున్నా. గతంలో నేనెప్పుడూ వీటి గురించి ఆలోచించలేదు. ఇకపై మారే రుతువులను బట్టి ఆహారం తీసుకుంటా. మరింత సమయం నాతో నేనే గడుపుతా. క్వారంటైన్, చికిత్సా సమయంలో నేను ఆధ్మాత్మికత వైపు మళ్లాను’ అని పేర్కొన్నారు.
నేటి యువతకు చాలా విషయాలు మెరుగ్గా తెలుసని 61 ఏళ్ల మహిళ అంగీకరించారు. కొవిడ్-19 తర్వాత తనలో కలిగిన మార్పులను వివరించారు. ‘సాధారణంగా ఏ ఇంట్లోనైనా పెద్దలు చెప్పిందే పిల్లలు వినాలని అంటారు. కానీ, యువతరానికి ఈ ప్రపంచం గురించి మన కన్నా బాగా తెలుసని గుర్తించాలి. వారి మాట మనం వినాలి. గతంలో నేనిలా ఆలోచించలేదు. కరోనాకు ముందు విరామం లేకుండా తినేదాన్ని. ఇప్పుడు కొంత విరామం ఇచ్చి ఆహారాన్ని తీసుకుంటున్నా. ఇదిప్పుడు అలవాటుగా మారింది’ అని ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్