కొవిడ్-19కు మరో ఔషధం
కొవిడ్-19 చికిత్సకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) సంస్థ నెబులైజర్ ఆధారిత మందును తయారుచేసింది. లైఫ్ యాక్టివస్, సుప్రీం ఇండస్ట్రీస్తో ...
జంతువులపై ప్రయోగం విజయవంతం
నైపర్ సంస్థ ప్రకటన
హైదరాబాద్: కొవిడ్-19 చికిత్సకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) సంస్థ నెబులైజర్ ఆధారిత మందును తయారుచేసింది. లైఫ్ యాక్టివస్, సుప్రీం ఇండస్ట్రీస్తో కలిసి సంయుక్తంగా లైఫ్ వైరోట్రీట్ అనే ఈ ఔషధాన్ని తయారు చేసినట్లు నైపర్ డైరెక్టర్ డాక్టర్ శశిబాలాసింగ్ ప్రకటించారు. లైఫ్ యాక్టివస్ ఎండీ డాక్టర్ కేశవ్ డియో, సుప్రీం ఇండస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ పంచసర, నైపర్ డీన్ డాక్టర్ శ్రీనివాస్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ మందును గత నాలుగు నెలల్లో వివిధ రకాల జంతువులపై ప్రయోగించగా విజయవంతంగా పనిచేస్తోందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్, మందు తయారీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించిందన్నారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఔషధాన్ని కొవిడ్-19 వైరస్ సోకిన వారితో పాటు ముందస్తుగా కూడా వినియోగించుకునే వీలుంటుందని చెప్పారు.
‘రక్తంలో ఆక్సిజన్ను పెంచుతుంది’
ఫ్లూ, శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లపై ఈ మందు పనిచేస్తుందని శశిబాలాసింగ్ పేర్కొన్నారు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు బాగా ఉపకరిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?