Rahul Gandhi : చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ ములాఖత్
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్గూడ జైలుకు చేరుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్గూడ జైలుకు చేరుకున్నారు. జైలులో ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. వారిని పరామర్శించి పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని.. మీ వెంట మేమున్నామని ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఓయూలో ధర్నా చేసిన ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
అయితే మొదటగా జైలులో ములాఖత్కు రాహుల్గాంధీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్ నేతలు కోరిన మీదట ఈ ఉదయం అనుమతి లభించింది. రాహుల్తోపాటు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.
రాహుల్ గాంధీ చంచల్గూడ జైలుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు చేపట్టారు. రాహుల్ ములాఖత్ ముగిసే వరకూ జైలులో సాధారణ ములాఖత్లను నిలిపివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?