Rahul Gandhi : చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ ములాఖత్‌

 తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు.

Published : 07 May 2022 13:44 IST

హైదరాబాద్‌ :  తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు.  జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్‌ అయ్యారు. వారిని పరామర్శించి పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని.. మీ వెంట మేమున్నామని ఎన్‌ఎస్‌యూఐ నేతలకు రాహుల్‌ చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఓయూలో ధర్నా చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

అయితే మొదటగా జైలులో ములాఖత్‌కు రాహుల్‌గాంధీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్‌ నేతలు కోరిన మీదట ఈ ఉదయం అనుమతి లభించింది. రాహుల్‌తోపాటు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.

రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు చేపట్టారు. రాహుల్‌ ములాఖత్‌ ముగిసే వరకూ జైలులో సాధారణ ములాఖత్‌లను నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని